Chiranjeevi: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యే ఎంతో మంది యువ హీరోలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు మెగా స్టార్ . చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి దాదాపు అరడజను మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. తమ్ముళ్లు నాగబాబు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ప్రవేశించి తమ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ తో నిలదొక్కుకుంటున్నారు.
అయితే మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి కారణంగా నష్టపోయారట. అవునా నిజామా అదెలా అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా అల్లు అర్జునే చెప్పాడు. అయితే అల్లు అర్జున్ మెగాస్టార్ డాన్స్ కారణంగా డబ్బులు పోగొట్టుకున్నాడాట. చిరంజీవి డాన్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన బాడీలో ఉన్న గ్రేస్ గురించి ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఇంద్ర మూవీ సమయంలో అల్లు అర్జున్ కి , తన ఫ్రెండ్ కి మధ్య ఓ చిన్న డిస్కషన్ జరిగిందట.
‘దాయి దాయి దామా’ సాంగ్ లో చిరంజీవి వీన స్టెప్ హైలెట్ అయిన విషయం తెలిసిందే. ఆ స్టెప్ వేసేటప్పుడు ఆయన పక్కన హీరోయిన్ సోనాలి బింద్రే ఉందని అతని ఫ్రెండ్ .. లేదని అల్లు అర్జున్ ఇద్దరు వాదించుకున్నారట. బన్నీ ఇంద్ర సినిమాను అప్పట్లో 17 సార్లు చూసాడట . దీనితో ఆ సాంగ్ లో చిరంజీవి ఒక్కరే స్టెప్ వేశారని మొండిగా వాదించాదట. అంతే కాదు 25 వేలు రూపాయలు బెట్ కూడా కట్టాడట . కానీ చివరికి వీడియో చూస్తే చిరూ పక్కనపాటలో సోనాలి బింద్రే కూడా వీణ స్టెప్ వేసింది. అప్పుడు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నువ్వు చెప్పిందే నిజమని ఒప్పుకున్నాడట. ఈ పాటలో చిరంజీవిని మాత్రమే చూసానని హీరోయిన్ వైపు చూపు కూడా వెళ్లలేదని చెప్పాడట . అలా మెగాస్టార్ కారణంగా అల్లు అర్జున్ 25 వేలు నష్టపోయారట.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…
This website uses cookies.