Categories: LatestNewsPolitics

Chandrababu: తగ్గేది లే అంటున్న చంద్రబాబు

Chandrababu: ఏపీలో ఎన్నికల రణరంగం ఇప్పుడే కనిపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా చేయడానికి చట్టాన్ని ఉపయోగించుకుంటుంది. ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ బలమైన రాజకీయ కార్యాచరణతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్చితమైన వ్యూహాలతో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. జనసేన బలం కూడా తొడవుతుంది అని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. వైసీపీని ఓడించడానికి ఉన్న అన్ని రకాల అవకాశాలని చంద్రబాబు వినియోగించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.

రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసుని చిట్ ఫండ్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. దీని వెనుక వైసీపీ ప్రమేయం ఉందని నమ్ముతున్నారు. మరోవైపు చాలా నియోజకవర్గాలలో వైసీపీ ఇన్ చార్జ్ లని ఏదో ఒక కేసు పెట్టి ప్రభుత్వం ఇరికించే ప్రయత్నం చేస్తోందనేది టీడీపీ వాదన. ఇదిలా ఉంటే వైసీపీ వేధింపులకి భయపడేది లేదని చెప్పుకొచ్చారు. ఇంత వరకు వైసీపీ నాయకుల విషయంలో కాస్తా ఆలోచించి వ్యవహరించానని, అయితే ఇప్పుడు తగ్గేది లేదని కామెంట్స్ చేశారు. అలాగే ఎవరికీ ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. తన కోపం ఏంటో జగన్ రెడ్డి చూస్తాడని వార్నింగ్ ఇచ్చారు.

రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని, కచ్చితంగా ఇప్పుడు చేస్తున్నడానికి రెండింతలు బదులు చెల్లిస్తామని హెచ్చరించారు. మొత్తానికి ఇప్పటి వరకు సంప్రదాయ రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు వైసీపీని దీటుగా ఎదుర్కోవడానికి తాను కూడా అగ్రిసివ్ పొలిటీషియన్ గా మారుతున్నారు. అలాగే ప్రస్తుత రోజుల్లో పద్ధతిగా సమాధానాలు చెబితే వినే పరిస్థితిలో ఎవరూ లేరనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా ఆయన రాజకీయ వ్యవహారాలు చూస్తూ ఉంటే తెలుస్తోంది. మరి ఈ అగ్రెసివ్ రాజకీయాలతో 2024 ఎన్నికలలో చంద్రబాబు ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది చూడాలి.

Varalakshmi

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

10 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

12 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.