TDP PARTY: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన బాట పట్టారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఈసారి ఆయన పర్యటన వెనుక కేవలం రాజకీయ సమీకరణాలు మాత్రమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తును మార్చే బలమైన ఆర్థిక అజెండా ఉంది. విభజన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీని తిరిగి పట్టాలెక్కించడమే లక్ష్యంగా, పక్కా ప్రణాళికతో ఆయన ఢిల్లీలో అడుగుపెడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగనున్న ఈ పర్యటనలో చంద్రబాబు టార్గెట్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరగబోయే భేటీ. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన చట్టంలోని హామీల అమలుపై ఈ సమావేశంలో బాబు గళం విప్పనున్నారు. కేంద్ర పెద్దల మద్దతు ఉంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుందని నమ్ముతున్న సీఎం.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీలు, ఆర్థిక వెసులుబాటుపై అమిత్ షా ముందు స్పష్టమైన నివేదిక ఉంచబోతున్నారు.
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు..
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడమే చంద్రబాబు తదుపరి టార్గెట్. ఇందుకోసం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల తక్షణ విడుదల, సాంకేతిక అనుమతులపై ఈ భేటీలో చర్చించనున్నారు. పోలవరం పనులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ సాధించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి.
కేవలం కేంద్ర సాయంపైనే ఆధారపడకుండా, అంతర్జాతీయ సంస్థల మద్దతు కూడగట్టడంలో చంద్రబాబు దిట్ట. ఈ పర్యటనలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో ఆయన జరపబోయే చర్చలు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఊతమిచ్చేలా సాగనున్నాయి. దీంతో పాటు ప్రతిష్టాత్మక సీఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొని, దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించి, రాష్ట్రానికి సరికొత్త పరిశ్రమలను తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు.
చివరగా, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్, నీతిఆయోగ్ సభ్యులతో సమావేశం కావడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికి ఒక శాశ్వత మార్గాన్ని అన్వేషించబోతున్నారు. మొత్తంగా చూస్తే, రాజకీయ వ్యూహాల కంటే ఏపీ ఆర్థికాభివృద్ధి, నిధుల సాధనే పరమావధిగా చంద్రబాబు ఈ హస్తిన పర్యటనను డిజైన్ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ ద్విదిన పర్యటన రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేకూరుస్తుందో వేచి చూడాలి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.