TDP PARTY: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన బాట పట్టారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఈసారి ఆయన పర్యటన వెనుక కేవలం రాజకీయ సమీకరణాలు మాత్రమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తును మార్చే బలమైన ఆర్థిక అజెండా ఉంది. విభజన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీని తిరిగి పట్టాలెక్కించడమే లక్ష్యంగా, పక్కా ప్రణాళికతో ఆయన ఢిల్లీలో అడుగుపెడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగనున్న ఈ పర్యటనలో చంద్రబాబు టార్గెట్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరగబోయే భేటీ. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన చట్టంలోని హామీల అమలుపై ఈ సమావేశంలో బాబు గళం విప్పనున్నారు. కేంద్ర పెద్దల మద్దతు ఉంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుందని నమ్ముతున్న సీఎం.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీలు, ఆర్థిక వెసులుబాటుపై అమిత్ షా ముందు స్పష్టమైన నివేదిక ఉంచబోతున్నారు.
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు..
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడమే చంద్రబాబు తదుపరి టార్గెట్. ఇందుకోసం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల తక్షణ విడుదల, సాంకేతిక అనుమతులపై ఈ భేటీలో చర్చించనున్నారు. పోలవరం పనులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ సాధించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి.
కేవలం కేంద్ర సాయంపైనే ఆధారపడకుండా, అంతర్జాతీయ సంస్థల మద్దతు కూడగట్టడంలో చంద్రబాబు దిట్ట. ఈ పర్యటనలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో ఆయన జరపబోయే చర్చలు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఊతమిచ్చేలా సాగనున్నాయి. దీంతో పాటు ప్రతిష్టాత్మక సీఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొని, దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించి, రాష్ట్రానికి సరికొత్త పరిశ్రమలను తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు.
చివరగా, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్, నీతిఆయోగ్ సభ్యులతో సమావేశం కావడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికి ఒక శాశ్వత మార్గాన్ని అన్వేషించబోతున్నారు. మొత్తంగా చూస్తే, రాజకీయ వ్యూహాల కంటే ఏపీ ఆర్థికాభివృద్ధి, నిధుల సాధనే పరమావధిగా చంద్రబాబు ఈ హస్తిన పర్యటనను డిజైన్ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ ద్విదిన పర్యటన రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేకూరుస్తుందో వేచి చూడాలి.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.