Chandrababu: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా చుట్టూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సీబీఐ విచారణ వేగవంతం చేయడం, అందులో నిందితులు, అనుమానితులుగా ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిని చేర్చడం జరిగింది. దీంతో గత ఎన్నికలకి ముందు వివేకానంద రెడ్డి హత్య టీడీపీ చేయించింది అని ప్రచారం చేసుకొని లబ్ది పొందిన వైసీపీకి పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. అయితే ఈ కేసులో ఇప్పుడు కొత్త కొత్త ఆరోపణలతో వైసీపీ నాయకులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ, చంద్రబాబు దీనినే ఆయుధంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వివేకానందని హత్య చేసి తమ రాజకీయాలకి జగన్ రెడ్డి వాడుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈ కేసులో నిందితులు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారని అన్నారు. వివేకానంద హత్య కేస్ అనేది ఒక కేస్ స్టడీ లాంటిది అని పేర్కొన్నారు. ఇక వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు సీబీఐని మ్యానేజ్ చేసి ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించే కుట్రలు చేస్తుననరంటూ విమర్శలు చేస్తున్నారు. సీబీఐ సమగ్ర విచారణ చేయకుండానే భాస్కర్ రెడ్డిని నిందితుడుగా చేర్చింది అంటూ వాదిస్తున్నారు. అసలు అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి వివేకానంద హత్యతో సంబంధమే లేదని చెప్పుకొస్తున్నారు.
ఇక జగన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డిని బయటకి తీసుకొచ్చేందుకు కేంద్రంలోని పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు అంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. విదేశీ పర్యటన సైతం రద్దు చేసుకొని ఉన్నపళంగా ఢిల్లీ టూర్ వెళ్ళడానికి జగన్ రెడీ అవుతూ ఉండటం వెనుక వివేకానంద కేసు విషయమే ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం సలహాదారు సజ్జల మాత్రం వైసీపీ నాయకులని ఇరికించడం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందనే విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తలనొప్పిగా మారితే టీడీపీకి ఆయుధంగా మారిందని చెప్పాలి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.