Chandrababu: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా చుట్టూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సీబీఐ విచారణ వేగవంతం చేయడం, అందులో నిందితులు, అనుమానితులుగా ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిని చేర్చడం జరిగింది. దీంతో గత ఎన్నికలకి ముందు వివేకానంద రెడ్డి హత్య టీడీపీ చేయించింది అని ప్రచారం చేసుకొని లబ్ది పొందిన వైసీపీకి పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. అయితే ఈ కేసులో ఇప్పుడు కొత్త కొత్త ఆరోపణలతో వైసీపీ నాయకులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ, చంద్రబాబు దీనినే ఆయుధంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వివేకానందని హత్య చేసి తమ రాజకీయాలకి జగన్ రెడ్డి వాడుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈ కేసులో నిందితులు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారని అన్నారు. వివేకానంద హత్య కేస్ అనేది ఒక కేస్ స్టడీ లాంటిది అని పేర్కొన్నారు. ఇక వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు సీబీఐని మ్యానేజ్ చేసి ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించే కుట్రలు చేస్తుననరంటూ విమర్శలు చేస్తున్నారు. సీబీఐ సమగ్ర విచారణ చేయకుండానే భాస్కర్ రెడ్డిని నిందితుడుగా చేర్చింది అంటూ వాదిస్తున్నారు. అసలు అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి వివేకానంద హత్యతో సంబంధమే లేదని చెప్పుకొస్తున్నారు.
ఇక జగన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డిని బయటకి తీసుకొచ్చేందుకు కేంద్రంలోని పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు అంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. విదేశీ పర్యటన సైతం రద్దు చేసుకొని ఉన్నపళంగా ఢిల్లీ టూర్ వెళ్ళడానికి జగన్ రెడీ అవుతూ ఉండటం వెనుక వివేకానంద కేసు విషయమే ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం సలహాదారు సజ్జల మాత్రం వైసీపీ నాయకులని ఇరికించడం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందనే విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తలనొప్పిగా మారితే టీడీపీకి ఆయుధంగా మారిందని చెప్పాలి.
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…
This website uses cookies.