Chandrababu: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా చుట్టూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సీబీఐ విచారణ వేగవంతం చేయడం, అందులో నిందితులు, అనుమానితులుగా ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిని చేర్చడం జరిగింది. దీంతో గత ఎన్నికలకి ముందు వివేకానంద రెడ్డి హత్య టీడీపీ చేయించింది అని ప్రచారం చేసుకొని లబ్ది పొందిన వైసీపీకి పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. అయితే ఈ కేసులో ఇప్పుడు కొత్త కొత్త ఆరోపణలతో వైసీపీ నాయకులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ, చంద్రబాబు దీనినే ఆయుధంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వివేకానందని హత్య చేసి తమ రాజకీయాలకి జగన్ రెడ్డి వాడుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈ కేసులో నిందితులు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారని అన్నారు. వివేకానంద హత్య కేస్ అనేది ఒక కేస్ స్టడీ లాంటిది అని పేర్కొన్నారు. ఇక వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు సీబీఐని మ్యానేజ్ చేసి ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించే కుట్రలు చేస్తుననరంటూ విమర్శలు చేస్తున్నారు. సీబీఐ సమగ్ర విచారణ చేయకుండానే భాస్కర్ రెడ్డిని నిందితుడుగా చేర్చింది అంటూ వాదిస్తున్నారు. అసలు అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి వివేకానంద హత్యతో సంబంధమే లేదని చెప్పుకొస్తున్నారు.
ఇక జగన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డిని బయటకి తీసుకొచ్చేందుకు కేంద్రంలోని పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు అంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. విదేశీ పర్యటన సైతం రద్దు చేసుకొని ఉన్నపళంగా ఢిల్లీ టూర్ వెళ్ళడానికి జగన్ రెడీ అవుతూ ఉండటం వెనుక వివేకానంద కేసు విషయమే ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం సలహాదారు సజ్జల మాత్రం వైసీపీ నాయకులని ఇరికించడం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందనే విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తలనొప్పిగా మారితే టీడీపీకి ఆయుధంగా మారిందని చెప్పాలి.
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
Narendra Modi: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయా? అయితే ఆ భారాన్ని పైసా పైసా చొప్పున లీటర్ మీద…
AP Politics: రాజకీయాల్లో టైమింగ్, లాజిక్ అనేవి చాలా ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్థులకు అస్త్రంగా దొరికిపోతాం.…
Bandi Bhagirath Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పాలనలో…
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్పీడుతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు కూడా…
This website uses cookies.