Categories: LatestNewsPolitics

Chandrababu: వైఎస్ వివేకానంద హత్య కేస్ స్టడీ అంటున్న చంద్రబాబు

Chandrababu: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా చుట్టూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సీబీఐ విచారణ వేగవంతం చేయడం, అందులో నిందితులు, అనుమానితులుగా ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిని చేర్చడం జరిగింది. దీంతో గత ఎన్నికలకి ముందు వివేకానంద రెడ్డి హత్య టీడీపీ చేయించింది అని ప్రచారం చేసుకొని లబ్ది పొందిన వైసీపీకి పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. అయితే ఈ కేసులో ఇప్పుడు కొత్త కొత్త ఆరోపణలతో వైసీపీ నాయకులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ, చంద్రబాబు దీనినే ఆయుధంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వివేకానందని హత్య చేసి తమ రాజకీయాలకి జగన్ రెడ్డి వాడుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.

ఈ కేసులో నిందితులు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారని అన్నారు. వివేకానంద హత్య కేస్ అనేది ఒక కేస్ స్టడీ లాంటిది అని పేర్కొన్నారు. ఇక వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు సీబీఐని మ్యానేజ్ చేసి ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించే కుట్రలు చేస్తుననరంటూ విమర్శలు చేస్తున్నారు. సీబీఐ సమగ్ర విచారణ చేయకుండానే భాస్కర్ రెడ్డిని నిందితుడుగా చేర్చింది అంటూ వాదిస్తున్నారు. అసలు అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి వివేకానంద హత్యతో సంబంధమే లేదని చెప్పుకొస్తున్నారు.

ఇక జగన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డిని బయటకి తీసుకొచ్చేందుకు కేంద్రంలోని పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు అంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. విదేశీ పర్యటన సైతం రద్దు చేసుకొని ఉన్నపళంగా ఢిల్లీ టూర్ వెళ్ళడానికి జగన్ రెడీ అవుతూ ఉండటం వెనుక వివేకానంద కేసు విషయమే ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం సలహాదారు సజ్జల మాత్రం వైసీపీ నాయకులని ఇరికించడం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందనే విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తలనొప్పిగా మారితే టీడీపీకి ఆయుధంగా మారిందని చెప్పాలి.

Varalakshmi

Recent Posts

TTD: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలా..ఈ చిన్న పని చేస్తే చాలు?

TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…

23 hours ago

Mangoes: రాత్రిపూట మామిడిపండు తిని పడుకుంటున్నారా? ఈ ఇబ్బందులు మీ వెంటే?

Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…

2 days ago

Tirumala Tirupati: ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. శ్రీవారి దర్శన గడువు పెంపు..

Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…

2 days ago

TDP PARTY: టీడీపీలో రాజ్యసభ మంటలు.. మొద‌లైన బుజ్జ‌గింపులు..!

TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…

2 days ago

Politics: మోదీకి 7 రోజులే టైమ్.. కొత్త పార్టీ అల్టిమేటం!

Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…

2 days ago

AP POLITICS: ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. లీకైన హాట్ లిస్ట్!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…

2 days ago

This website uses cookies.