Wed. Feb 11th, 2026

    BRS Party: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నడూ లేని స్థాయిలో వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరుకున్నాయి. ఎలా అయినా తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ అధికార బీఆర్ఎస్ పై తన అస్త్రాలని సంధిస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరుని కూడా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈడీ ఇప్పటికే కవిత మాజీ పీఎని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కవిత బినామీగా చెప్పబడుతున్నపిళ్ళైని కూడా అదుపులోకి తీసుకొని ఈడీ విచారిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కవితని ఈడీ విచారణకి పిలిచిన సంగతి తెలిసిందే.

    Delhi liquor scam: Kejriwal and Ramadhir are friends in this saga

    ఇదిలా ఉంటే కవితని అరెస్ట్ చేస్తారనే ప్రచారం తెరపైకి రావడంతో కేసీఆర్ పార్టీ నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాచరణ వ్యూహాలపై చర్చించారు. ఇక కవితని అరెస్ట్ చేసిన నేపధ్యంలో  పంచ వ్యూహాలతో బీజేపీని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఓ వైపు కవితకి సపోర్ట్ గా ఆందోళనలు చేయడంతో పాటు, గవర్నర్ ని కలిసి కవితపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఫిర్యాదు చేసేందుకు సిధం అయ్యారు.

    అదే సమయంలో విస్తృతంగా ప్రజలలోకి బీజేపీ నియంతృత్వ ధోరణిని తీసుకెళ్ళడానికి వ్యూహం సిద్ధం చేశారు. అయితే విచారణలో ఈడీ కవితని అరెస్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా వేసిన ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. బీజేపీలోకి వెళ్ళిపోతే బ్లాక్ మార్క్ ఉన్నవాళ్ళు అందరూ కూడా వైట్ గా మారిపోతారు అంటూ పోస్టర్స్ లో పెట్టారు. ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి.