Categories: LatestNewsPolitics

BJP: ఈశాన్యంలో విరిసిన కమలం

BJP: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన ప్రస్థానం మరింత విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది కేవలం ఒక్క స్థానంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన బిజెపి పార్టీ ఎప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు విస్తరించింది. త్రిపుర, నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో  మేఘాలయ తప్ప మిగిలిన రెండు రాష్ట్రాల్లో బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. త్రిపుర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీలకు గండికోడుతూ బిజెపి అధికారాన్ని సొంతం చేసుకోవడం సంచలనం అని చెప్పాలి. క్రైస్తవ ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బిజెపి అధికారంలోకి రావడం వెనుక వారి బలమైన వ్యూహాలు ఉన్నాయని చెప్పాలి.

 

కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిపి జతకట్టి బిజెపిని ఓడించే ప్రయత్నం చేసిన కూడా వారి పాచికులు పారలేదు. మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. మోడీ సారథ్యంలోని బిజెపి పార్టీ ఈశాన్య భారతంలో కూడా కమలం జెండా ఎగరేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా ఈశాన్య భారతంలో విస్తృతంగా కార్యకలాపాలు చేస్తూ ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారిని చైతన్యపరిచే ప్రయత్నం చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా మాంసాహారులుగా ఉంటారు. ఈ నేపథం కొద్దిగా బీజేపీ మతతత్వ విధానాలను విడిచిపెట్టిందని చెప్పాలి. ఒకప్పుడు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా ఉన్నవారు ప్రస్తుతం బిజెపికి ఈశాన్య రాష్ట్రాల్లో బలంగా మారారు.

 

కాంగ్రెస్ అధిష్టానం వైఖరులతో విసిగిపోయిన ఆ నాయకులు బిజెపిలోకి వచ్చి స్వేచ్ఛగా తమ వ్యూహాలను అమలు చేశారు. అలా వచ్చిన వారిలో ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బిజెపిలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన వారు. క్రైస్తవ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నాగాలాండ్ లో కూడా ప్రస్తుతం బిజెపి అధికారంలోకి రావడం విశేషం. దీన్ని బట్టి మోడీ ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందనేది చెప్పొచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బాగా వేసేందుకు సిద్ధమవుతుంది. ఆ దిశగా బలమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.

Varalakshmi

Recent Posts

Eyes: కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ వ్యాధి  లక్షణాలు కావచ్చు!

Eyes:  ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…

11 minutes ago

Tirumala: తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం !

Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…

5 hours ago

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

1 day ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

1 day ago

Breast Cancer: మహిళల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్లు.. తెలుసుకోవలసిన విషయాలు ఇవే!

Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…

1 day ago

Politics: తెలంగాణపై మోదీ కన్ను.. రూటు మార్చిన రేవంత్‌..!

Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…

1 day ago

This website uses cookies.