Categories: LatestNewsPolitics

BJP: ఈశాన్యంలో విరిసిన కమలం

BJP: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన ప్రస్థానం మరింత విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది కేవలం ఒక్క స్థానంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన బిజెపి పార్టీ ఎప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు విస్తరించింది. త్రిపుర, నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో  మేఘాలయ తప్ప మిగిలిన రెండు రాష్ట్రాల్లో బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. త్రిపుర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీలకు గండికోడుతూ బిజెపి అధికారాన్ని సొంతం చేసుకోవడం సంచలనం అని చెప్పాలి. క్రైస్తవ ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బిజెపి అధికారంలోకి రావడం వెనుక వారి బలమైన వ్యూహాలు ఉన్నాయని చెప్పాలి.

 

కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిపి జతకట్టి బిజెపిని ఓడించే ప్రయత్నం చేసిన కూడా వారి పాచికులు పారలేదు. మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. మోడీ సారథ్యంలోని బిజెపి పార్టీ ఈశాన్య భారతంలో కూడా కమలం జెండా ఎగరేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా ఈశాన్య భారతంలో విస్తృతంగా కార్యకలాపాలు చేస్తూ ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారిని చైతన్యపరిచే ప్రయత్నం చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా మాంసాహారులుగా ఉంటారు. ఈ నేపథం కొద్దిగా బీజేపీ మతతత్వ విధానాలను విడిచిపెట్టిందని చెప్పాలి. ఒకప్పుడు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా ఉన్నవారు ప్రస్తుతం బిజెపికి ఈశాన్య రాష్ట్రాల్లో బలంగా మారారు.

 

కాంగ్రెస్ అధిష్టానం వైఖరులతో విసిగిపోయిన ఆ నాయకులు బిజెపిలోకి వచ్చి స్వేచ్ఛగా తమ వ్యూహాలను అమలు చేశారు. అలా వచ్చిన వారిలో ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బిజెపిలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన వారు. క్రైస్తవ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నాగాలాండ్ లో కూడా ప్రస్తుతం బిజెపి అధికారంలోకి రావడం విశేషం. దీన్ని బట్టి మోడీ ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందనేది చెప్పొచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బాగా వేసేందుకు సిద్ధమవుతుంది. ఆ దిశగా బలమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.

Varalakshmi

Recent Posts

Guava fruit: జామ పండు ఆరోగ్యానికి మంచిదే కానీ వీళ్ళు మాత్రం కాదండోయ్?

Guava fruit: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా పండ్లలో…

15 hours ago

SSD Tokens Cancelled: శ్రీవారి భక్తులకు అలర్ట్..SSD టోకెన్లు రద్దు.. పూర్తి వివరాలివే!

SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…

16 hours ago

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

2 days ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

2 days ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

5 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

5 days ago

This website uses cookies.