Beauty Tips: చాలామంది పళ్ళను సరిగా తోమకపోవడం వలన అలాగే వారి ప్రాంతంలో నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటం వలన వారి పళ్ళు పసుపుకొచ్చే రంగులోకి మారుతూ ఉంటాయి. ఇలా పసుపుపచ్చ రంగులోకి మారడం వల్ల నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటానికి నవ్వటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తమ దంతాలను మిలమిల మెరిసేలా చేసుకోవాలి అంటే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.
పసుపు పచ్చని దంతాలు తెల్లగా మారాలి అంటే ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దానిపై పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఓ నిమ్మకాయను అయిదారు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గ్లాసు నీటిని వేసి నీరు బాగా వేడెక్కిన తర్వాత ఆ నీటిలోకి అల్లం నిమ్మకాయ ముక్కలను వేయాలి. ఇవి బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీటిని వడపోసి పక్కన పెట్టుకోవాలి.
మరొక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ లవంగాల పొడి ఒక టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్ మరొక టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కలపడం కోసం వేడి చేసి వడపోసుకున్న నీటిని కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో బాగా పళ్ళను తోమాలి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల కొద్ది రోజులలోనే మీ పళ్ళపై ఉన్నటువంటి పసుపు పంచ మరకలు తొలగిపోయి దంతాలు చాలా తెల్లగా మెరిసిపోతాయి.
AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు…
Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి…
Film Updates: టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన…
Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…
This website uses cookies.