Beauty Tips: చాలామంది పళ్ళను సరిగా తోమకపోవడం వలన అలాగే వారి ప్రాంతంలో నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటం వలన వారి పళ్ళు పసుపుకొచ్చే రంగులోకి మారుతూ ఉంటాయి. ఇలా పసుపుపచ్చ రంగులోకి మారడం వల్ల నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటానికి నవ్వటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తమ దంతాలను మిలమిల మెరిసేలా చేసుకోవాలి అంటే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.
పసుపు పచ్చని దంతాలు తెల్లగా మారాలి అంటే ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దానిపై పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఓ నిమ్మకాయను అయిదారు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గ్లాసు నీటిని వేసి నీరు బాగా వేడెక్కిన తర్వాత ఆ నీటిలోకి అల్లం నిమ్మకాయ ముక్కలను వేయాలి. ఇవి బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీటిని వడపోసి పక్కన పెట్టుకోవాలి.
మరొక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ లవంగాల పొడి ఒక టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్ మరొక టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కలపడం కోసం వేడి చేసి వడపోసుకున్న నీటిని కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో బాగా పళ్ళను తోమాలి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల కొద్ది రోజులలోనే మీ పళ్ళపై ఉన్నటువంటి పసుపు పంచ మరకలు తొలగిపోయి దంతాలు చాలా తెల్లగా మెరిసిపోతాయి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.