Beauty Tips: చాలామంది పళ్ళను సరిగా తోమకపోవడం వలన అలాగే వారి ప్రాంతంలో నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటం వలన వారి పళ్ళు పసుపుకొచ్చే రంగులోకి మారుతూ ఉంటాయి. ఇలా పసుపుపచ్చ రంగులోకి మారడం వల్ల నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటానికి నవ్వటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తమ దంతాలను మిలమిల మెరిసేలా చేసుకోవాలి అంటే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.
పసుపు పచ్చని దంతాలు తెల్లగా మారాలి అంటే ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దానిపై పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఓ నిమ్మకాయను అయిదారు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గ్లాసు నీటిని వేసి నీరు బాగా వేడెక్కిన తర్వాత ఆ నీటిలోకి అల్లం నిమ్మకాయ ముక్కలను వేయాలి. ఇవి బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీటిని వడపోసి పక్కన పెట్టుకోవాలి.
మరొక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ లవంగాల పొడి ఒక టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్ మరొక టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కలపడం కోసం వేడి చేసి వడపోసుకున్న నీటిని కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో బాగా పళ్ళను తోమాలి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల కొద్ది రోజులలోనే మీ పళ్ళపై ఉన్నటువంటి పసుపు పంచ మరకలు తొలగిపోయి దంతాలు చాలా తెల్లగా మెరిసిపోతాయి.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.