Beauty Tips: చాలామంది పళ్ళను సరిగా తోమకపోవడం వలన అలాగే వారి ప్రాంతంలో నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటం వలన వారి పళ్ళు పసుపుకొచ్చే రంగులోకి మారుతూ ఉంటాయి. ఇలా పసుపుపచ్చ రంగులోకి మారడం వల్ల నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటానికి నవ్వటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తమ దంతాలను మిలమిల మెరిసేలా చేసుకోవాలి అంటే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.
పసుపు పచ్చని దంతాలు తెల్లగా మారాలి అంటే ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దానిపై పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఓ నిమ్మకాయను అయిదారు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గ్లాసు నీటిని వేసి నీరు బాగా వేడెక్కిన తర్వాత ఆ నీటిలోకి అల్లం నిమ్మకాయ ముక్కలను వేయాలి. ఇవి బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీటిని వడపోసి పక్కన పెట్టుకోవాలి.
మరొక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ లవంగాల పొడి ఒక టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్ మరొక టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కలపడం కోసం వేడి చేసి వడపోసుకున్న నీటిని కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో బాగా పళ్ళను తోమాలి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల కొద్ది రోజులలోనే మీ పళ్ళపై ఉన్నటువంటి పసుపు పంచ మరకలు తొలగిపోయి దంతాలు చాలా తెల్లగా మెరిసిపోతాయి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.