జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్ళేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. అందుకు వినూత్నంగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తున్నారు. ఇంకా సినిమా విడుదల కాలేదు. కానీ ఇప్పటికే ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదేశాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే మఠాధిపతులు స్వామీజీలు కూడా వీక్షించి సినిమా గురించి గొప్పగా మాట్లాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారు అని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్ చెబుతున్నారు. అరిషడ్వర్గాలపై తీసిన ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకు చాలా ముఖ్యం అని, నిజంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ స్పెషల్ షోని చూసిన వారందరూ తెగ పొగిడేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను కాస్త వినూత్నంగా చేస్తున్న మూవీ మేకర్స్ ఈ సినిమాను చూసేందుకు చాలా మందికి అవకాశం కల్పిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే సినిమాను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదెలా అంటే జయశంకర్ తాజాగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ పోస్టులో జయశంకర్ విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా వీక్షించాలి అనుకునేవారు వివరాలను తెలియజేయండి అంటూ ఒక వాట్సాప్ నెంబర్ను జోడించి ఒక పోస్ట్ ని విడుదల చేశారు. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో ఒక వైరల్ కావడంతో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్. ఇలా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వినూత్నంగా చేస్తుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో జాక్వెలిన్ పెర్నాండేజ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.