Durga Pooja: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన ఇంట్లో పూజ చేసినప్పుడు లేదా ఆలయానికి వెళ్ళినప్పుడు పుష్పాలను తీసుకొని వెళ్తాము ఇలా వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూజలు చేస్తుంటామో ఇలా సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరణ చేయడం వల్ల స్వామివారి ప్రీతి చెంది తమ కరుణ కటాక్షాలు మనపై పెడతారని భావిస్తారు.
ఈ క్రమంలోనే దేవతలకు ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలు శివుడికి తెలుపు రంగు పుష్పాలతో పూజించడం ఎంతో మంచిది. ఇలా కొంతమంది దేవతలకు కొన్ని రకాల పుష్పాలతో పూజ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ క్రమంలోనే స్వామి వారి పూజ చేయడానికి పారిజాత పుష్పాలు కూడా ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.
ఇకపోతే మన ఇంట్లో దుర్గ మాత చిత్రపటం ఉన్న లేదా దుర్గ ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల పుష్పాలను అసలు తీసుకొని వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు.జిల్లేడు, నందివర్ధనం, పారిజాత పుష్పాలు, నాగ చంపా, బృహస్పతి, తంగేడు వంటి పువ్వులతో పూజ చేయకూడదు. ఈ విధమైన పువ్వులతో పూజ చేయడంవల్ల అమ్మవారి అనుగ్రహం కలగడం ఏమోగానీ అమ్మ వారి ఆగ్రహానికి లోనవుతారని పండితులు చెబుతున్నారు. దుర్గామాతకు ఎల్లప్పుడూ సంపెంగ తంగేడు వంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. నిన్నటివరకు ఏ పార్టీని…
AP POLITICS: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎన్నో మీమ్స్, ట్రెండ్స్ చూసుంటాం. కానీ, ఏకంగా దేశంలోని ప్రధాన…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర…
AP POLITICS: దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ స్థానాల భర్తీకి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
This website uses cookies.