Politics: మూడేళ్ళ తర్వాత ప్రధానమంత్రి మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మిత్రపక్షం అన్న తర్వాత కలయిక సర్వసాధారణం అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కలయిక ఓ వైపు టీడీపీ పార్టీలో గుబులు పుట్టిస్తుంది. మరో వైపు మోడీ పర్యటనకి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు జన సమీకరణ కూడా చేస్తున్న వైసీపీకి కూడా మింగుడుపడని అంశంగా మారింది. ప్రధాని కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ కి నేరుగా మోడీని కలవాలని పిలుపు వచ్చింది. మొన్నటి వరకు జనసేనకి ప్రధాని మోడీ, అమిత్ షా కనీసం ఆపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు.
ఇప్పుడు ఊహించని విధంగా మోడీ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడానికి ఏపీకి రావడం, పవన్ కళ్యాణ్ ని కలవాలని కబురు పంపడం జరిగింది. ఈ విషయం వైసీపీ అధిష్టానంకి అస్సలు మింగుడు పడటం లేదు. దీనికి కారణంగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమకి అతిపెద్ద శత్రువుగా మారిపోయాడు. ప్రజలలో కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ని వీలైనంత తక్కువ చేయాలని, అతన్ని అణచివేయాలని వైసీపీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.
వారి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడుకునే కర్మ తనకి పట్టలేదని. మోడీపై అభిమానం ఉన్నా కూడా రూట్ మ్యాప్ కోసం ఇక వేచి చూసే ధోరణి ఉండదని, వీలైనంత త్వరగా వారు స్పందించకుండా నేనే నా ప్లాన్ లో ముందుకి వెళ్తానని చెప్పేసారు. దీంతో బీజేపీ అధిష్టానంలో కూడా కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ సాయంతో ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తుంది. పవన్ కళ్యాణ్ తమ నుండి దూరంగా వెళ్తే అసలుకే ప్రమాదం వస్తుందని భావించారు. ఈ నేపధ్యంలోనే ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీని కలిసి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి. టీడీపీతో కలిసి వెళ్లడంపై పునరాలోచన చేస్తారా లేక బీజేపీతో కలిసి ఒంటరి పోరాటం చేస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మీడియాతో పాటు, ప్రధాన రాజకీయ పార్టీలు పవన్, మోడీ కలయికతో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.