Politics: మూడేళ్ళ తర్వాత ప్రధానమంత్రి మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మిత్రపక్షం అన్న తర్వాత కలయిక సర్వసాధారణం అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కలయిక ఓ వైపు టీడీపీ పార్టీలో గుబులు పుట్టిస్తుంది. మరో వైపు మోడీ పర్యటనకి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు జన సమీకరణ కూడా చేస్తున్న వైసీపీకి కూడా మింగుడుపడని అంశంగా మారింది. ప్రధాని కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ కి నేరుగా మోడీని కలవాలని పిలుపు వచ్చింది. మొన్నటి వరకు జనసేనకి ప్రధాని మోడీ, అమిత్ షా కనీసం ఆపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు.
ఇప్పుడు ఊహించని విధంగా మోడీ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడానికి ఏపీకి రావడం, పవన్ కళ్యాణ్ ని కలవాలని కబురు పంపడం జరిగింది. ఈ విషయం వైసీపీ అధిష్టానంకి అస్సలు మింగుడు పడటం లేదు. దీనికి కారణంగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమకి అతిపెద్ద శత్రువుగా మారిపోయాడు. ప్రజలలో కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ని వీలైనంత తక్కువ చేయాలని, అతన్ని అణచివేయాలని వైసీపీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.
వారి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడుకునే కర్మ తనకి పట్టలేదని. మోడీపై అభిమానం ఉన్నా కూడా రూట్ మ్యాప్ కోసం ఇక వేచి చూసే ధోరణి ఉండదని, వీలైనంత త్వరగా వారు స్పందించకుండా నేనే నా ప్లాన్ లో ముందుకి వెళ్తానని చెప్పేసారు. దీంతో బీజేపీ అధిష్టానంలో కూడా కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ సాయంతో ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తుంది. పవన్ కళ్యాణ్ తమ నుండి దూరంగా వెళ్తే అసలుకే ప్రమాదం వస్తుందని భావించారు. ఈ నేపధ్యంలోనే ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీని కలిసి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి. టీడీపీతో కలిసి వెళ్లడంపై పునరాలోచన చేస్తారా లేక బీజేపీతో కలిసి ఒంటరి పోరాటం చేస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మీడియాతో పాటు, ప్రధాన రాజకీయ పార్టీలు పవన్, మోడీ కలయికతో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.