Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల భర్తీకి సోమవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఈ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ప్రకటనతో ఆయా రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్‌ల పదవీకాలం ఈ నెల 26వ తేదీతో ముగిసిపోనుంది. దాంతో ఈ నలుగురు ప్రస్తుతానికి పెద్దల సభ నుంచి నిష్క్రమించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

andhra-pradesh-the-rajya-sabha-election-schedule-has-arrived-those-four-are-out

Andhra Pradesh: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ నాలుగు సీట్లను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఢిల్లీకి పంపే ఆ నలుగురు అభ్యర్థులు ఎవరు? ఎవరికి ఏ కోటాలో సీటు దక్కనుంది? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కూటమి పెద్దలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసినప్పటికీ, పేర్లపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఈ ఎన్నికల ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ఈసీ గడువులను ప్రకటించింది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఆ మరుసటి రోజే, అంటే జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరగనుంది. బరి నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.

అసలైన ఉత్కంఠ పోరు జూన్ 18న జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎలక్షన్ ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, రాత్రికి తుది ఫలితాలను అనౌన్స్ చేస్తారు. మొత్తానికి జూన్ 20 నాటికి ఈ ఎన్నికల హడావుడి పూర్తిగా ముగిసిపోనుంది. మరి ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ నలుగురు కొత్త లీడర్లు ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

3 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

3 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

4 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

4 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

5 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

5 days ago

This website uses cookies.