ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26వ తేదీతో ముగిసిపోనుంది. దాంతో ఈ నలుగురు ప్రస్తుతానికి పెద్దల సభ నుంచి నిష్క్రమించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
మరోవైపు ఈ ఎన్నికల ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ఈసీ గడువులను ప్రకటించింది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఆ మరుసటి రోజే, అంటే జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరగనుంది. బరి నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.
అసలైన ఉత్కంఠ పోరు జూన్ 18న జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎలక్షన్ ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, రాత్రికి తుది ఫలితాలను అనౌన్స్ చేస్తారు. మొత్తానికి జూన్ 20 నాటికి ఈ ఎన్నికల హడావుడి పూర్తిగా ముగిసిపోనుంది. మరి ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ నలుగురు కొత్త లీడర్లు ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.