ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26వ తేదీతో ముగిసిపోనుంది. దాంతో ఈ నలుగురు ప్రస్తుతానికి పెద్దల సభ నుంచి నిష్క్రమించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
మరోవైపు ఈ ఎన్నికల ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ఈసీ గడువులను ప్రకటించింది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఆ మరుసటి రోజే, అంటే జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరగనుంది. బరి నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.
అసలైన ఉత్కంఠ పోరు జూన్ 18న జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎలక్షన్ ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, రాత్రికి తుది ఫలితాలను అనౌన్స్ చేస్తారు. మొత్తానికి జూన్ 20 నాటికి ఈ ఎన్నికల హడావుడి పూర్తిగా ముగిసిపోనుంది. మరి ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ నలుగురు కొత్త లీడర్లు ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…
Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన గండిపేటలో ఓ భారీ భూకుంభకోణం వెలుగుచూసింది.…
This website uses cookies.