Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల భర్తీకి సోమవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఈ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ప్రకటనతో ఆయా రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్‌ల పదవీకాలం ఈ నెల 26వ తేదీతో ముగిసిపోనుంది. దాంతో ఈ నలుగురు ప్రస్తుతానికి పెద్దల సభ నుంచి నిష్క్రమించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

andhra-pradesh-the-rajya-sabha-election-schedule-has-arrived-those-four-are-out

Andhra Pradesh: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ నాలుగు సీట్లను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఢిల్లీకి పంపే ఆ నలుగురు అభ్యర్థులు ఎవరు? ఎవరికి ఏ కోటాలో సీటు దక్కనుంది? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కూటమి పెద్దలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసినప్పటికీ, పేర్లపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఈ ఎన్నికల ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ఈసీ గడువులను ప్రకటించింది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఆ మరుసటి రోజే, అంటే జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరగనుంది. బరి నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.

అసలైన ఉత్కంఠ పోరు జూన్ 18న జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎలక్షన్ ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, రాత్రికి తుది ఫలితాలను అనౌన్స్ చేస్తారు. మొత్తానికి జూన్ 20 నాటికి ఈ ఎన్నికల హడావుడి పూర్తిగా ముగిసిపోనుంది. మరి ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ నలుగురు కొత్త లీడర్లు ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

pomegranate: ఒక కప్పు దానిమ్మ గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

pomegranate: సాధారణంగా మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందాలి అంటే తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు…

4 days ago

TTD: శ్రీవారి భక్తులు అలర్ట్…ఈ 3 నెలల వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు..

TTD: తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. ఇక స్వామివారిని…

4 days ago

This website uses cookies.