Categories: LatestNewsPolitics

Janasena: పవన్ కళ్యాణ్ సభపై సర్వత్రా ఆసక్తి

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో బహిరంగసభని ఏర్పాటు చేశారు. ఆవిర్భావ సభగా ఇది ఉండబోతుంది. ఇప్పటికే ఈ సభ కోసం పోలీసులు సెక్షన్ 30 పేరుతో ఆంక్షలు విధించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా తనకున్న అన్ని అవకాశాలని ఉపయోగించుకొని సభకి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సభపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. దీనికి కారణం ఈ ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ప్రభావితం చేసే కీలక విషయాలని వెల్లడిస్తాడని భావిస్తున్నారు. అలాగే ఏపీలో త్వరలో బస్సు యాత్ర చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు.

అలాగే పొత్తులపై టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. పొత్తులతోనే అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పటికే టీడీపీ ద్వంద్వ రాజకీయాలని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించారు. ఈ నేపధ్యంలో  కచ్చితంగా ఈ సభలో టీడీపీ పార్టీకి కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మరో వైపు జనసైనికులు, కాపు సంఘాలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటి అనేదానిపై వారికి ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక 25 ఏళ్ళ రాజకీయ ప్రయాణం అనుకోని వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా 15 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ నేపధ్యంలో 2024 ఎన్నికలు అతనికి చాలా కీలకం అని చెప్పాలి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా బలమైన స్థానాలని సొంతం చేసుకుంటేనే అధికారంలొకి రావొచ్చు అని భావిస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా చాలా అనుమానంతోనే పవన్ కళ్యాణ్ ని చూస్తుంది. ఓ వైపు పొత్తు అంటున్న కూడా టీడీపీకి దగ్గర అవుతున్నాడు అనే ప్రచారం ఉన్న నేపధ్యంలో పొత్తుపై ఎలాంటి స్పష్టత ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Varalakshmi

Recent Posts

Bandi Bhagirath: బండి సంజయ్ కుమారుడి కేసులో ట్విస్ట్‌.. ఊరంతా అవే పోస్టర్లు!

Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…

1 day ago

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…

1 day ago

Petrol Price News: ఇంత దారుణంగా పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?

Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…

2 days ago

CM Revanth Reddy: కేంద్రంతో క‌లుస్తాం.. కానీ, అందుకు మాత్రం కాదు!

CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

2 days ago

Narendra Modi: గోల్డ్‌ కొనకండి.. మోదీ పిలుపు వెనుక అర్థ‌మేంటి..?

Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…

3 days ago

Roja Selvamani: USలో తొలి ఇండియ‌న్‌గా అన్షు క్రేజీ రికార్డ్‌.. ఏడ్చేసిన రోజా!

Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…

3 days ago

This website uses cookies.