Akshaya tritiya: పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ పండగను ఈ ఏడాది శుక్రవారం మే 10, 2024 సంవత్సరంలో జరుపుకుంటారు. అక్షయ తృతీయను పవిత్రమైన శుభ సమయంగా పరిగణిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం ఎంతో మంచిదని భావిస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారు వెండి ఆభరణాలను తమ స్తోమతకు అనుగుణంగా కొనుగోలు చేస్తూ ఉంటారు.
ఇక ఇదే రోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తమకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే అక్షయ తృతీయ రోజు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలకు పాత్రులు కావచ్చుని భావిస్తూ ఉంటారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున తులసితో ఈ పరిహారం కనుక చేస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపైనే ఉంటాయి.
వైశాఖ శుక్ల తృతీయ తిథి మే 10వ తేదీ 2024 ఉదయం 04:17 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి మే 11వ తేదీ తెల్లవారుజామున 02:50 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలోనే అక్షయ తృతీయ రోజు తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజించాలి తులసి మొక్కలు సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుందని భావిస్తుంటారు ఈ తరుణంలోని అక్షయ తృతీయ రోజు కొత్త తులసి మొక్కను నాటడం ఎంతో శుభప్రదం. అదేరోజు సాయంత్రం నెయ్యితో తులసి మొక్కకు దీపారాధన చేయటం కూడా ఎంతో మంచిది. ఇక విష్ణుమూర్తికి అక్షయ తృతీయ రోజు సమర్పించే నైవేద్యంలో తప్పనిసరిగా తులసి దళాలను వాడటం వల్ల సాక్షాత్తు ఆ విష్ణమూర్తి కరుణ కటాక్షాలు కూడా మన పైనే ఉంటాయి.దీనితో పాటు అక్షయ తృతీయ రోజున తులసి దళంపై స్వస్తిక చిహ్నాన్ని వేసి, పూజలో తులసి ను సమర్పించి ధూపం, దీపం, సువాసన, పువ్వులు మొదలైనవి సమర్పించడం మంచిది
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.