Aditya-L1 : సూర్యుని సీక్రెట్స్ ను బయటపెట్టడమే లక్ష్యంగా ప్రయోగించిన భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. భూకక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య కక్ష్యను ఆదివారం విజయవంతంగా శాస్త్రవేత్తలు అధికం చేశారు. ఉపగ్రహం ప్రస్తుతం 245× 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి వెళ్లినట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదిత్య ఎల్ 1 కక్ష్యను పంచారు. ఈ నెల 5వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలను కక్ష్యను మరోసారి ఇస్రో పెంచనుంది. 125 రోజుల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనున్న ఆదిత్య ఎల్ 1, లగ్రాంజ్ 1 పాయింట్లో ప్రవేశించి భానుడినిపై పరిశోదనలు చేయనుండి.
శ్రీహరికోట నుంచి శనివారం పీస్ఎల్వీ-సి57 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన ఈ శాటిలైట్ 63 మినిట్స్ జర్నీ చేసి నిర్దేశిత భూ కక్ష్యలోకి వెళ్లింది. 16 రోజులు భూకక్ష్యలో తిరిగిన తర్వాత భూమికి 15 లక్షల కి.మీ. దూరంలోఎల్1 బిందువువైపు ట్రావెల్ చేస్తుంది. 1480 కేజీల బరువున్న ఆదిత్య ఎల్ 1లో ఏడు రీసెర్చ్ ఎక్విప్మెంట్ పంపారు. భానుడి పైపొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్లలో సంభవించే సోలార్ స్టార్మ్స్ , జ్వాలను, రేణువులను పరిశీలిస్తుంది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు సక్సెస్ కావడంతో ఇస్రో ప్రతిష్టాత్మకంగా 2008లో పురుడుపోసుకున్న ఆదిత్య ప్రాజెక్టును రెట్టింపు ఉత్సాహంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ టెక్నికల్ గా సాయం అందిస్తోంది.
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
Narendra Modi: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయా? అయితే ఆ భారాన్ని పైసా పైసా చొప్పున లీటర్ మీద…
This website uses cookies.