Actress Sadha: దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై భారత సుప్రీంకోర్టు ఆగస్టు 11న వెలువరించిన ఒక సంచలనాత్మక తీర్పు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, ఆందోళనలకు కారణమవుతోంది. ఢిల్లీలోని వీధి కుక్కలన్నింటినీ ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, వారికి తీవ్ర పరిణామాలు తప్పవని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన క్షణం నుంచి జంతు ప్రేమికులలో, మానవతా దృక్పథం కలిగిన పౌరులలో, ముఖ్యంగా సినీ ప్రముఖులలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని, ఇది చివరికి వేలాది మూగజీవాలను చంపేసే పరిస్థితికి దారితీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జంతు సంరక్షణ పట్ల తనకున్న ప్రేమను తరచుగా చాటుకునే సినీ నటి సదా, సుప్రీంకోర్టు తీర్పుపై తన బాధను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హృదయ విదారక వ్యాఖ్యలు చేశారు. “ఒకే ఒక్క రేబిస్ కేసు కోసం లక్షలాది కుక్కలను తరలిస్తారా? లేక చంపేస్తారా? కేవలం ఎనిమిది వారాల గడువులో ప్రభుత్వం ఇన్ని షెల్టర్లు ఎక్కడ, ఎలా సిద్ధం చేస్తుంది? ఇది సాధ్యమే కాదు. చివరికి వాటిని చంపే పరిస్థితి వస్తుంది” అంటూ ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
ఈ సమస్యకు మూల కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని సదా ఆరోపించారు. “మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు వీధి కుక్కలకు వ్యాక్సిన్ విషయంలో ఏం చేశారు? జంతు జనన నియంత్రణ (Animal Birth Control – ABC) కార్యక్రమాలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి, వాటిని సక్రమంగా అమలు చేసి ఉంటే, పరిస్థితి ఇక్కడివరకు చేరేది కాదు. జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు తమ సొంత డబ్బుతో వీధి కుక్కలు, పిల్లుల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“వీధుల్లో శునకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తేనే నా మనసు ముక్కలవుతోంది. ఎవరిని కలవాలి, ఎక్కడ నిరసన చేయాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ ఒకటే చెప్పగలను. ఈ తీర్పు నన్ను లోపల చంపేస్తోంది. ఆ మూగజీవాలను చంపడం సరైంది కాదు. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పును వెనక్కు తీసుకోండి” అంటూ సదా కన్నీళ్లతో, చేతులు జోడించి వేడుకున్నారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సదా ఒక్కరే కాదు, ఈ తీర్పుపై వంటి పలువురు సినీ తారలు కూడా సుప్రీంకోర్టు తీర్పుపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తిరస్కరించాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ తీర్పుపై ప్రభుత్వ స్పందన మరియు తదుపరి చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.