Categories: LatestNews

Technology: 5జీ సేవల తర్వాత 4జీ స్మార్ట్ ఫోన్స్ పరిస్థితి ఏంటి? నిపుణులు ఏమంటున్నారంటే…?

Technology: అక్టోబర్ లో భారత్ లోకి 5జీ ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధాని మోడీ చాలా గ్రాండ్ గా ఈ 5జీ సేవలని ప్రారంభించబోతున్నారు. జియో మొదటిగా ఈ 5జీ సేవలని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. ఈ 5జీ సేవల ద్వారా మొబైల్ ఇంటర్ నెట్ సేవలలో 10 రేట్లు వేగం ఉంటుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, బ్రిటన్ లలో నడుస్తున్నాయి.

ఇప్పుడు ఇండియాలోకి ఈ 5జీ సేవలు ప్రవేశించబోతున్నాయి. ఇంటర్ నెట్ యూజర్స్ కి ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి. అయితే ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ మొబైల్ డివైజ్ లని అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఎక్కువగా 5జీ సేవలలోకి మారడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపధ్యంలో అందుకు తగ్గట్లుగానే మొబైల్ ఉత్పత్తులని మార్కెట్ లోకి తీసుకొని రావాలి.

స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పటికే ఈ 5జీ సర్వీస్ మొబైల్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. ఇక పూర్తి స్థాయిలో ఇంటర్ నెట్ టెక్నాలజీ 5జీలోకి వస్తే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 4జీ స్మార్ట్ ఫోన్స్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వీటిని త్వరగా వదిలించుకోవడానికి కంపెనీలు కూడా రెడీ అవుతాయి. ఈ నేపధ్యంలో 5జీ మొబైల్స్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. టెక్ మార్కెట్ ని స్టడీ చేసే నిపుణులు కూడా ఇదే విషయాన్నిచెబుతున్నారు.

కంపెనీలు మార్కెట్ లో ఉన్న తమ 4జీ స్మార్ట్ ఫోన్స్ ని వీలైనంత వేగంగా సేల్స్ చేసి 5జీ మీద ఫోకస్ పెట్టె అవకాశం ఉంటుందని, ఈ నేపధ్యంలో ధరల్ని తగ్గించడంతో పాటు, భారీ ఆఫర్స్ ని కూడా ప్రకటించే అవకాశం ఉందని సైబర్‌ మీడియా రీసెర్చ్‌లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు అమిత్ శర్మ అంటున్నారు. స్టాక్ కి వేగంగా క్లియర్ చేయడంపై కంపెనీలు దృష్టి పెడతాయని అంటున్నారు. అయితే 5జీ పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రావాలంటే కనీసం ఏడాది సమయం అయినా పడుతుందని అంత వరకు 4జీ మొబైల్స్ ధరల తగ్గే అవకాశం ఉండకపోవచ్చని మరో టెక్ నిపుణులు ఫైసల్ కవూసా అంటున్నారు.

ఇవి కూడా ఆల్టర్ నేటివ్ గా మార్కెట్ లో ఉంటాయని అంటున్నారు. 5జీ టెక్నాలజీకి సంబంధించి టవర్స్ ఇన్స్టలేషన్ పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా ఒకేసారి చేయడం లేదు. ముందుగా 13 ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్ , జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే లలో ఈ సేవలని మొదటి దశలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రాంతాలలో టవర్స్ ని రియలన్స్ అభివృద్ధి చేస్తుంది.

ఈ నగరాలలో సక్సెస్ అయిన తర్వాత రెండో దశలో భాగంగా చిన్న పట్టణాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే దేశ వ్యాప్తంగా ఈ 5జీ విస్తరించడానికి కనీసం రెండేళ్ళకి పైగా పడుతుంది. అంత వరకు మార్కెట్ లో4జీ మొబైల్స్ కి వచ్చే నష్టం ఏమీ ఉండదని, సేల్స్ తగ్గే అవకాశం ఉండొచ్చేమో కాని పూర్తిగా ధరలు పతనం అయిపోవడం అంటూ జరగదని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ 5జీ సేవలు వచ్చే నెల నుంచి సరికొత్త మార్పులని తీసుకోస్తాయని మాత్రం చెప్పొచ్చు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Telangana: ఒక్క పేరు చెప్తే రూ. లక్ష.. తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్!

Telangana: అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఒకే ఒక్క చక్కటి పేరును సూచించడం ద్వారా అక్షరాలా ఒక లక్ష…

9 hours ago

AP POLITICS: పవన్ విషయంలో వైసీపీ యూ-టర్న్..!

AP POLITICS: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు అంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఒకరినొకరు నామరూపాలు…

10 hours ago

TDP PARTY: బాలయ్యకు మంత్రి పదవి.. చంద్రబాబు మైండ్‌లో ఏముంది..?

TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. కూటమి ప్రభుత్వంలో త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో…

11 hours ago

Tollywood: నారా రోహిత్ ఇంట సంబరాలు.. తండ్రైన స్టార్ హీరో!

Tollywood: టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్…

11 hours ago

Chicken: జ్వరం వచ్చినప్పుడు చికెన్ పక్కన పెట్టేస్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే?

Chicken: సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినడం…

18 hours ago

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులు అలర్ట్.. ప్రత్యేక దర్శన టికెట్ బుకింగ్ ఓపెన్..

Tirumala Darshan Tickets: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నటువంటి భక్తులకు టిటిడి శుభవార్తను తెలిపింది.…

19 hours ago

This website uses cookies.