Business: కాలుష్యం పెరగడం, పునరుత్పాదక వనరుల క్షీణత తో పాటు గాలి నాణ్యత తగ్గడంతో, ప్రపంచవ్యాప్తంగా ఎకో ఫ్రెండ్లీ పవర్ కు, టెక్నాలజీ సొల్యూషన్స్ విపరీతమైన వృద్ధిని సాధించింది. ఈ వృద్ధిని చూసి పర్యావరణ బాధ్యత కలిగిన శక్తి , సాంకేతిక పరిష్కారాల ఆవశ్యకతను తెలుసుకుని, గత కొన్ని సంవత్సరాలలో అనేక క్లీన్టెక్ స్టార్టప్లు ఉద్భవించాయి. ఈ క్రమంలో ప్రపంచాన్ని పరిశుభ్రంగా, పచ్చగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ గురించి ఇప్పుడు తెలసుకుంది. ఏపీ సోలార్ వర్క్స్ అనేది ఇండోర్ ఆధారిత రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్లీన్టెక్ స్టార్టప్ కంపెనీ . 2016లో అక్షయ్ గుప్తా పంకజ్ యాదవ్ లు ఈ స్టార్టప్ కంపెనీని స్థాపించారు.
ఇది బూట్స్ట్రాప్డ్ స్టార్టప్ కంపెనీ. క్లయింట్లకు సౌరశక్తి పరిష్కారాలను అందించేందుకు పనిచేస్తుంది. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తూ మార్కెట్లో నిలబడుతోంది. ఏపీ సోలార్ వర్క్స్ ప్రపంచాన్ని పరిశుభ్రంగా, పచ్చగా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభించబడిన కంపెనీ. ఈ స్టార్టప్ వివిధ పరిశ్రమలు, ఇన్స్టిట్యూట్లు, కార్యాలయాలు, గృహాలు, పాఠశాలలతో పాటుగా పవర్ ప్లాంట్లకు సౌరశక్తి పరిష్కారాలను అందిస్తోంది. భారతదేశం ఇప్పటికీ బొగ్గు వంటి సాంప్రదాయిక వనరులపై ఆధారపడి ఉండటం వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతోందని అందుకే ఈ పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు.
ఈ కంపెనీ ప్రస్తుతుం 8 రకాల విభిన్నమైన సోలార్ ప్యానెల్ సిస్టమ్లను అందిస్తోంది. అత్యంత నైపుణ్యం , సమర్థవంతమైన నిపుణుల బృందంతో, ఈ క్లీన్టెక్ స్టార్టప్ తన క్లయింట్లకు క్లాస్లో అత్యుత్తమ సౌరశక్తి పరిష్కారాలను అందించడానికి సరికొత్త సాంకేతికత ,ఆవిష్కరణలను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం కంపెనీలో 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్లీన్టెక్ స్టార్టప్ కంపెనీ ఇప్పటి వరకు 300కుపైగా ప్రాజెక్ట్లను ఇన్స్టాల్ చేసింది, 3.5 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందుతోంది. ఏపీ సోలార్ వర్క్స్ ఉత్తర్ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణతో సహా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ తమ సేవలను విస్తరించాలని ఆలోచిస్తోంది. అదే విధంగా వచ్చే మూడేళ్లలో సంవత్సరానికి రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది.
Swayambhu: బాహుబలి ని గుర్తు చేస్తున్న స్వయంభు టీజర్..నిఖిల్ రేంజ్ మారుతుందా?..అవును తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పాన్…
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
This website uses cookies.