Categories: LatestNewsPolitics

YSRCP: అధికార పార్టీ నాయకుల్లో కొత్త టెన్షన్.. ఆ రోజు ఏం జరగబోతుంది

YSRCP: ఏపీలో అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఏకంగా 175 నియోజకవర్గానికి లక్ష్యంగా జగన్ క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు వై నాట్ 175 అంటూ కొత్త నినాదంతో కార్యకర్తలను, నాయకులు ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరలా తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని ముఖ్యమంత్రి జగన్ చాలా నమ్మకంగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్రింది స్థాయి నాయకులతో సంబంధం లేకుండా మహిళలకు ఖాతాలో సంక్షేమ పథకాల పేరుతో నిధులను వేస్తున్నారు. దీనికోసం ఎక్కడా లేని అప్పులు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది.

ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరు ప్రజాక్షేత్రంలోకి ప్రజల మధ్యకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ఎమ్మెల్యేలు అందరూ కూడా సంక్షేమ పథకాలపై బలంగా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే పనితీరు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీటు ఖరారు చేయడం జరుగుతుందని కూడా క్లారిటీగా చెప్పాడు. రిపోర్ట్ లు తెప్పించుకొని చూస్తానని అందులో ఉన్న ఫీడ్ బ్యాక్ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఖరారు చేస్తానని కూడా కరాకండిగా తేల్చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏప్రిల్ మూడవ తేదీన చివరిగా మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు కూడా సరిగా లేకపోతే పదవులు నుంచి తొలగిస్తానని జగన్ క్లారిటీగా చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే ఎవరికి సీట్లు ఇచ్చేది ఎవరికి ఇవ్వనిది ఈ సమీక్ష సమావేశంలో తేల్చేయమన్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అదే సమయంలో ఎన్నికలకు ఎప్పుడు వెళ్లేది కూడా స్పష్టంగా చెప్పే అవకాశం ఉందని ప్రచారం నడుస్తూ ఉంది.

ఏది ఏమైనా ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఏప్రిల్ 3 అధికార పార్టీ నాయకులను కలవరపెడుతుంది. ఇప్పటికే పార్టీ ధిక్కరించారని ఆరోపణలతో నలుగురు ఎమ్మెల్యేలను జగన్ సస్పెండ్ చేశారు. దీని ద్వారా మిగిలిన అందరికి కూడా క్లియర్ సాంకేతాలు ఇచ్చారు. అసంతృప్తులు ఎవరైనా ఇప్పుడే బయటికి వెళ్లి పోవాలని, తనతో బయటకు గెంటించుకునే పరిస్థితి తీసుకురావద్దు అని కూడా చెప్పినట్లు అధికార పార్టీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది. మరి జగన్ ఏప్రిల్ 3న ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Varalakshmi

Recent Posts

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…

16 hours ago

Tuesday Auspiciousness: మంగళవారం కొత్త పనులు ప్రారంభించవచ్చా? మంచిదేనా?

Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…

16 hours ago

Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…

2 days ago

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

2 days ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

2 days ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

3 days ago

This website uses cookies.