Categories: NewsPolitics

YS Jagan: కుల సభలు పెట్టండి… ఎమ్మెల్యేలకి జగన్ అల్టిమేటం

YS Jagan: ఏపీలో అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలలో మరల అధికారంలోకి రావాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఓ వైపు సొంతపార్టీలోనే అసంతృప్తి ఎక్కువ అయిపోతూ ఉండటం జగన్ ని మరింత కలవరపెడుతుంది. ఈ నేపధ్యంలో వీలైనంత వేగంగా ప్రజలలోకి వెళ్లి ఈ అసంతృప్తి నాయకుల ప్రభావం ప్రజలపై పడకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసారు. మరింత మంది వీరి దారిలోనే వెళ్ళేదిశగా ఉన్నారు.

జనసేన టీడీపీతో కలుస్తుందని ప్రచారం తెరపైకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలలో గుబులు మొదలైంది. ఇదిలా ఉంటే మరోవైపు అధికారాన్ని సొంతం చేసుకోవాలని జగన్ రెడ్డి తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు తిరిగి పార్టీకి రివర్స్ కొడుతున్నాయి. ఎమ్మెల్యేలు గ్రామాలలోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని గ్రామాలలో ఎమ్మెల్యేలు తిరగాల్సిన పరిస్థితి ఉంది. మరో వైపు జగన్ సమావేశాలు పెడుతూ ఇప్పుడు కులాల వారీగా సభలు పెట్టాలని, బీసీ సభ పెట్టినట్లే అన్ని కులాల పేర్లతో సభలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకి జగన్ అల్టిమేటం జారీ చేశారు.

ys-jagan-warnts-to-mlas

అలాగే గ్రామసారథులని సిద్ధం చేసి వారికి వీలైనంత త్వరలో బాధ్యతలు అప్పగించాలని చెబుతున్నారు. అయితే పైసా ఆదాయం లేకుండా పార్టీ కోసం పనిచేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. అధికారంలోకి వస్తే ఏదో ఒక విధంగా పదవులు లేదా ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపిస్తున్న ఎవరూ ముందుకి రావడం లేదు. మరో వైపు ఎమ్మెల్యేలపై నివేదికలు తెప్పించుకొని చూస్తా అని ప్రజలలో వ్యతిరేకత ఉందని తెలిస్తే మాత్రం సీట్లు ఇచ్చేది లేదని కూడా వార్నింగ్ ఇస్తున్నారు.

ఇలా అన్నిరకాలుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లని అష్టదిగ్బంధనంలో ముఖ్యమంత్రి జగన్ పెట్టేసి యుద్ధం చేస్తున్నారు. ఇవన్ని తిరిగి పార్టీకి రివర్స్ లో ఎటాక్ చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. వీటిని ప్రతిపక్షాలు చూస్తూ తమకి అనుకూలంగా మార్చుకోవడానికి వెయిట్ చేస్తున్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

3 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

13 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

20 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

3 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

3 days ago

This website uses cookies.