Politics: ఇక పై ఎక్కడి నుంచైనా ఓట్లు వేసే అవకాశం ఉంటుందా?

Politics: ఎన్నికల సమయాలలో కొంత మంది దూర ప్రాంతాలలో ఉండి తమ ఓటుని వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికలలో తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం పట్టణాలకి వలస పోతారు. వారు ఎన్నికలకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే ఉద్యోగాలు చేసే వారు కూడా దూర ప్రాంతాలలో ఉంటూ ఓట్లు వేయడానికి సొంతూరు వెళ్ళాలంటే ఖర్చులు లెక్కపెట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ కారణంగా ఇండియాలో అసెంబ్లీ ఎన్నికలలో సరాసరి 60 నుంచి 70 శాతం మాత్రమే ఓట్లు నమోదు అవుతాయి. అయితే మిగిలిన 30 శాతం కూడా ప్రజలు ఓట్లు వినియోగించుకుంటే పోటీ చేసే నాయకుల భవిష్యత్తు మారిపోయే అవకాశం ఉంటుంది.

ఈ 60 శాతం పోలింగ్ లో కొంత మంది పదులు నుంచి వందల సంఖ్య ఓట్ల మార్జిన్ తో గెలుస్తారు. అయితే ఎన్నికలలో ఇకపై ఎక్కడి నుంచి అయినా ఓట్లు వేసుకునే విధంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మిషన్ ని ముందుగా ఐదు రాష్ట్రాలలో అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటుంది. ఇక జనవరి 16న ఈ కొత్త టెక్నాలజీ మిషన్ ని ప్రదర్శనకి ఉంచబోతున్నారు. ఇక ఈ మిషన్ పనితీరు, ప్రదర్శనని తిలకించడానికి అన్ని పార్టీలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

ఇక పార్టీల అభిప్రాయం మేరకు దీనిని ఫైనల్ స్టేజ్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక వేళ పార్టీలు ఏవైనా మార్పులు సూచిస్తే వాటికి అనుగుణంగా కూడా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక పార్టీల అంగీకారంతో ఈ మిషన్ ని ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలోకి తీసుకొస్తామని తెలిపారు. దీని ద్వారా ఓటర్ ఎక్కడ ఉంటే అక్కడ పోలింగ్ బూత్ కి వెళ్లి రోమోట్ సిస్టమ్ తో తన నియోజకవర్గానికి సంబందించిన డేటాతో కనెక్ట్ అయ్యి నచ్చిన వారికి ఓటు వేసే సౌలభ్యం ఉంటుంది. ఇది విజయవంతం అయితే మాత్రం దేశంలో కచ్చితంగా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు ప్రజలు కూడా నిరంభ్యంతరంగా తమకి నచ్చిన అభ్యర్దులకి ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. అయితే టెక్నాలజీ కాబట్టి హ్యాకింగ్ తో ఏదో ఒక అభ్యర్ధికి అనుకూలంగా ఓట్లు పడే విధంగా మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే సెన్సార్ మోనిటరింగ్ ద్వారా మరింత పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందని తెలుస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

5 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

12 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

19 hours ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

2 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

2 days ago

Political News: ఏపీలో పవన్.. తెలంగాణలో రేవంత్: ఇద్దరి ప్లాన్ ఒక్కటేనా?

Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…

2 days ago

This website uses cookies.