Karnataka Elections: కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఓడిపోయినా స్థానాలలో 50 వరకు తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువగా ఉన్నవే కావడం విశేషం. గత ఎన్నికలలో బీజేపీకి ఆదిక్యం ఇచ్చినవి కూడా ఇవే నియోజకవర్గాలు. అయితే ఇప్పుడు అక్కడే తెలుగు ఓటర్లు బీజేపీని గద్దె దించడానికి కారణం అయ్యారు. ఈ విషయం ఇప్పటికే కర్ణాటక నాయకులు కూడా గ్రహించారు. అయితే ఇప్పుడు బీజేపీ ఓటమికి మరో ప్రధాన కారణం కూడా ఉందనే మాట వినిపిస్తోంది. అది వైసీపీతో బీజేపీ నడుపుతున్న పరోక్ష పొత్తు. నిజానికి ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది.
అయితే కేంద్ర నాయకత్వం జనసేనాని కంటే వైఎస్ జగన్ ని ఎక్కువగా విశ్వసిస్తోంది అనే మాట చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ప్రచారం కోసం ఉపయోగించుకుందాం అని చెప్పిన కూడా వైసీపీకి సపోర్ట్ గా ఉండే నాయకులు అడ్డుపడినట్లు టాక్. తెలుగు ప్రజలు ఏపీలో వైసీపీ వైపు ఉన్నారని, అది కూడా రాయలసీమలోకి సరిహద్దుగా ఉన్న నియోజకవర్గాలు కాబట్టి కచ్చితంగా జగన్ ప్రభావం చేయగలరని భావించారంట. వైసీపీ నుంచి కూడా కర్ణాటక ఎన్నికలలో రాయలసీమ సరిహద్దు జిల్లాలలో బీజేపీకి సపోర్ట్ చేస్తామని హామీ లభించిందంట.
అలాగే కొంతమంది వైసీపీ నాయకులు సరిహద్దు జిల్లాలలో బీజేపీ కోసం ప్రచారం కూడా చేశారని టాక్. బీజేపీ జగన్ మీద నమ్మకం ఉంచి పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టడం జరిగిందని టాక్. అయితే వైసీపీ ప్రచారం బీజేపీకి ఏ విధంగా కలిసిరాలేదని, పైపెచ్చు వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికలలో తెలుగు ప్రజల ప్రభావం ఉన్న జిల్లాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని టాక్. దీంతో బీజేపీ ఇప్పుడు పునరాలోచించుకొని వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపిస్తుందనే మాట వినిపిస్తోంది.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.