Karnataka Elections: కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఓడిపోయినా స్థానాలలో 50 వరకు తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువగా ఉన్నవే కావడం విశేషం. గత ఎన్నికలలో బీజేపీకి ఆదిక్యం ఇచ్చినవి కూడా ఇవే నియోజకవర్గాలు. అయితే ఇప్పుడు అక్కడే తెలుగు ఓటర్లు బీజేపీని గద్దె దించడానికి కారణం అయ్యారు. ఈ విషయం ఇప్పటికే కర్ణాటక నాయకులు కూడా గ్రహించారు. అయితే ఇప్పుడు బీజేపీ ఓటమికి మరో ప్రధాన కారణం కూడా ఉందనే మాట వినిపిస్తోంది. అది వైసీపీతో బీజేపీ నడుపుతున్న పరోక్ష పొత్తు. నిజానికి ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది.
అయితే కేంద్ర నాయకత్వం జనసేనాని కంటే వైఎస్ జగన్ ని ఎక్కువగా విశ్వసిస్తోంది అనే మాట చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ప్రచారం కోసం ఉపయోగించుకుందాం అని చెప్పిన కూడా వైసీపీకి సపోర్ట్ గా ఉండే నాయకులు అడ్డుపడినట్లు టాక్. తెలుగు ప్రజలు ఏపీలో వైసీపీ వైపు ఉన్నారని, అది కూడా రాయలసీమలోకి సరిహద్దుగా ఉన్న నియోజకవర్గాలు కాబట్టి కచ్చితంగా జగన్ ప్రభావం చేయగలరని భావించారంట. వైసీపీ నుంచి కూడా కర్ణాటక ఎన్నికలలో రాయలసీమ సరిహద్దు జిల్లాలలో బీజేపీకి సపోర్ట్ చేస్తామని హామీ లభించిందంట.
అలాగే కొంతమంది వైసీపీ నాయకులు సరిహద్దు జిల్లాలలో బీజేపీ కోసం ప్రచారం కూడా చేశారని టాక్. బీజేపీ జగన్ మీద నమ్మకం ఉంచి పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టడం జరిగిందని టాక్. అయితే వైసీపీ ప్రచారం బీజేపీకి ఏ విధంగా కలిసిరాలేదని, పైపెచ్చు వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికలలో తెలుగు ప్రజల ప్రభావం ఉన్న జిల్లాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని టాక్. దీంతో బీజేపీ ఇప్పుడు పునరాలోచించుకొని వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపిస్తుందనే మాట వినిపిస్తోంది.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు…
TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి…
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
This website uses cookies.