Karnataka Elections: కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఓడిపోయినా స్థానాలలో 50 వరకు తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువగా ఉన్నవే కావడం విశేషం. గత ఎన్నికలలో బీజేపీకి ఆదిక్యం ఇచ్చినవి కూడా ఇవే నియోజకవర్గాలు. అయితే ఇప్పుడు అక్కడే తెలుగు ఓటర్లు బీజేపీని గద్దె దించడానికి కారణం అయ్యారు. ఈ విషయం ఇప్పటికే కర్ణాటక నాయకులు కూడా గ్రహించారు. అయితే ఇప్పుడు బీజేపీ ఓటమికి మరో ప్రధాన కారణం కూడా ఉందనే మాట వినిపిస్తోంది. అది వైసీపీతో బీజేపీ నడుపుతున్న పరోక్ష పొత్తు. నిజానికి ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది.
అయితే కేంద్ర నాయకత్వం జనసేనాని కంటే వైఎస్ జగన్ ని ఎక్కువగా విశ్వసిస్తోంది అనే మాట చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ప్రచారం కోసం ఉపయోగించుకుందాం అని చెప్పిన కూడా వైసీపీకి సపోర్ట్ గా ఉండే నాయకులు అడ్డుపడినట్లు టాక్. తెలుగు ప్రజలు ఏపీలో వైసీపీ వైపు ఉన్నారని, అది కూడా రాయలసీమలోకి సరిహద్దుగా ఉన్న నియోజకవర్గాలు కాబట్టి కచ్చితంగా జగన్ ప్రభావం చేయగలరని భావించారంట. వైసీపీ నుంచి కూడా కర్ణాటక ఎన్నికలలో రాయలసీమ సరిహద్దు జిల్లాలలో బీజేపీకి సపోర్ట్ చేస్తామని హామీ లభించిందంట.
అలాగే కొంతమంది వైసీపీ నాయకులు సరిహద్దు జిల్లాలలో బీజేపీ కోసం ప్రచారం కూడా చేశారని టాక్. బీజేపీ జగన్ మీద నమ్మకం ఉంచి పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టడం జరిగిందని టాక్. అయితే వైసీపీ ప్రచారం బీజేపీకి ఏ విధంగా కలిసిరాలేదని, పైపెచ్చు వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికలలో తెలుగు ప్రజల ప్రభావం ఉన్న జిల్లాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని టాక్. దీంతో బీజేపీ ఇప్పుడు పునరాలోచించుకొని వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపిస్తుందనే మాట వినిపిస్తోంది.
Water Bottle: సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటాము. అది ఎండాకాలమైనా లేదా వర్షాకాలమైనా…
Bhaumvati Amavasya 2026: ప్రతినెల మనకు అమావాస్య వస్తుంది అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను బౌమతి అమావాస్య లేదా…
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
This website uses cookies.