Viral News: సోషల్ మీడియా వినియోగం ఎక్కువైన తర్వాత ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగిన వింతలు విశేషాలను కూడా చాలా వేగంగా బయటికి వచ్చేస్తున్నాయి. ప్రపంచంలో చాలా చోట్ల దెయ్యం అనే భయం మనుషులకు ఉంది. చనిపోయిన తర్వాత కోరిక తీరని వారు ప్రేతాత్మలుగా మారి భయపెడుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. ఇలా దెయ్యాలను విశ్వసించేవారు హిందుత్వంలోనే కాకుండా అన్ని మతాలలో కూడా ఉన్నారు. ఇక ప్రజల్లో ఉండే దయ్యం అనే భయాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది భూతవైద్యులుగా మారి మంత్ర తంత్రాలతో, దేవుడి పేరుతో నిలువు దోపిడీ చేస్తూ ఉంటారు.
దెయ్యం పట్టింది అని నమ్మించి రకరకాల పూజలు చేసి మరింతగా భయపడుతూ ఉంటారు. కొంతమందిలో సైక్లోజికల్ డిజార్డర్ కారణంగా తమ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఒక మహిళ తన భర్తకు దెయ్యం పట్టిందని, ఆ దయ్యం తనను తీవ్రంగా వేధిస్తుందని, తల నుంచి విడాకులు కావాలని కోరుకుంటున్నారు. ఆక్స్ఫర్డ్ సైడ్ కు చెందిన రాకర్ బ్రూకార్డ్ హలో విండే రోజు ఎడ్వర్డ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారి పెళ్లి కూడా ఒక పాడుబడ్డ చర్చిలో జరిగింది. ఏదో కొత్తగా ఉంటుందని ఆమె అలా ప్రయత్నం చేసింది.
తర్వాత నుంచి తన భర్తను విక్టోరియా సైనికుడు పూనాడని, ఆ దెయ్యం తనను వెంటాడి వేధిస్తుందని భూతవైద్యుని కోసం వెతుకుతున్నట్లుగా ఆమె పేర్కొంది. తన భర్తను పట్టిన దయ్యం చిన్నపిల్లల రూపంలో ఏడుస్తూ తనను భయభ్రాంతులకు గురి చేస్తుందని పేర్కొంది. ఇక తన నుంచి విడాకులు కూడా తీసుకోవాలని రాకర్ ప్రయత్నిస్తూ ఉంది. అయితే రాకర్ భర్త ఎడ్వర్డ్ మాట మాత్రం మరో విధంగా ఉంది. ఆమెకు తరచుగా పీడకలు వస్తున్నాయని, అతిగా ఆలోచిస్తూ తనను దెయ్యం వేధిస్తుందని బ్రాహ్మలో ఉందని అంటున్నారు. ఆమె విడాకులు కోరుకుంటున్నప్పుడు తాను ఇంకేం చేస్తానని అన్నారు. ఆమె ఇష్ట ప్రకారమే విడాకులు ఇస్తానని కూడా ఎడ్వర్డ్ చెప్పడం విశేషం. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి దయ్యం పట్టిన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి ఆమె సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.