Categories: DevotionalNews

Pooja: అసలు పూజ ఎందుకు చేయాలి? చేయకపోతే దేవుడు శపిస్తాడా?

Pooja: ఆధునిక కాలంలో అందరిదీ హడావిడి జీవితమే. నిముషం ఖాళీ లేకుండా ఏదో ఒక వ్యాపకంలో మునిగిపోతున్నారు ప్రజలు. భార్య భర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే కానీ ఇళ్లు గడవని పరిస్థితులు ఉన్నాయి. ఇంటి పని చేసుకోవడమే గగనమైపోయింది. అలాంటిది రోజూ దేవుడికి పూజ చేయటం అంటే అదో పెద్ద పనిగా అనుకునేవారు చాలా మందే ఉన్నారు. ఈ రోజుల్లో ప్రశాంతంగా దేవుడి మందిరంలో కూర్చుని పూజ చేసే మహిళల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. అవును దేవుడికి రోజూ పూజ చేయకపోతే ఏమౌతుంది క‌ళ్లుపోతాయా? దేవుడు శపిస్తాడా? అని వాధించేవారు లేకపోలేదు.

నిజానికి రోజూ పూజ చేయకపోతే శపించేటంత మూర్ఖుడు కాడు దేవుడు. కళ్లు అంతకన్నాపోవు. పూజ అనేది ఓ తపస్సు లాంటిది. మానసిక వికాసానికి అది ఒక మార్గం లాంటిది. అది తెలియక చాలా మంది ఆదరాబాదరాగా , హంగు ఆర్భాటాలతో భారీ ఎత్తున పూజలు చేస్తుంటారు. ఇంకొంతమంది అసలు పూజా మందిరం తలుపే తట్టరు. ప్రతి రోజు దేవుడికి దండం పెట్టుకోవాలి లేకపోతే కళ్లుపోతాయి. దీపాన్ని ఈ నూనెతోనే వెలిగించాలి లేకపోతే దేవుడికి కోపం వస్తుంది. భారీగా ప్రసాదాలు పెడితేనే దేవుడు కరునిస్తాడు. అలంకరణ గొప్పగా ఉంటేనే అమ్మవారు ఆశీర్వదిస్తుంది.

ఇన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తేనే స్వామి కరుణ లభిస్తుందని చాలా మంది చిన్నపిల్లల్లా ఆలోచిస్తుంటారు. నిజానికి దేవుడు ఇవేమీ అడగడు. ఆయన నిరాకారుడు , నిరంజనుడు. ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఏదో ఒక రూపంలో ఉన్నాడు. అందుకే ఆయనకు చేసే పూజలోనూ ప్రజల సంతోషాలనే వెతికే స్వభావం కలిగిన వాడు దేవుడు. తల్లి్ద్రండులకు పిల్లల మీద ఎలాంటి ప్రేమ, అనురాగం, మమకారం ఉంటుందో దేవుడూ అంతే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ దేవుడు తన పిల్లలే అని అనుకుంటాడు. అందరిపైన చల్లని చూపు చూపుతాడు.

ఇక అసలు విషయానికి వస్తే..ప్రతి రోజూ పూజ చేయడం అంటే ఒక యాగంతో సమానం. యోగా చేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఎలా లభిస్తుందో అదే విధంగా పూజ చేయడం వల్ల మనసుకు వ్యాయామం లభిస్తుంది. ఏం మనసుకు వ్యాయామం అవసరమా అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుత సమాజంలో తప్పక అవసరం అని చెప్పక తప్పదు. చాలా మంది మానసిక ప్రశాంతత లేక నిరుత్సాహకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. తమ బాధను పంచుకునే వారు లేక మానసికంగా కుంగిపోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు పూజ చేయడం వ్లల మనసును స్థిరంగా ఉంచుకోవచ్చు. ఆందోళనలను దూరం చేసుకోవచ్చు.

మనిషి మనుసు నిలకడగా ఉండదు. సందర్భాన్ని బట్టి అది మారిపోతుంటుంది. మనసు నిలకడగా ఉండటానికి పూజ చేయడం ఎంతో అవసరం అని దైవజ్ఞులు తెలిపే మాట ఇది. మన మనసు కోపానికి, క్రోదానికి, మత్తు, మందు ,జూదానికి బానిసలుగా మారకుండా ఉండటానికి పూజ ఒక సాధనంగా పనిచేస్తుంది. మన మనసును నిలకడగా ఉంచి చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా నియంత్రిస్తుంది.

దేవుడికి స్థోమతను బట్టి నెయ్యి దీపాలు, లేదా నూనె దీపాలు పెడుతుంటారు. నెయ్యి దీపం పెడితేనే అధిక పుణ్యం లభిస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందులోనూ ఓ ఆరోగ్య సూత్రం దాగి ఉంది. దీపం పెట్టి ఆ దీపం ముందు కొద్ది సమయం గడపటం వల్ల ఆ దీపపు వెలుగులతో కంటి జబ్బులు పోతాయని పెద్దలు చెప్పే మాటలు. అంతే కానీ ఏ పదార్ధంతో దీపం పెట్టినా పలకరించే మహోన్నతుడు దేవుడు.

ఇక చాలా మంది ఇళ్లల్లో ప్రతి రోజు 108 నామాలను జపిస్తుంటారు. క్లిష్టమైన మంత్రాలను దేవుడి ముందు ఉచ్ఛరిస్తుంటారు. ఇది కూడా శరీరానికి ఒకరకంగా వ్యాయామమే. ఇలా క్లిష్టమైన పదాలను చెప్పడం వల్ల తెలుగుపై పట్టు రావడంతో పాటు నాలిక మొద్దుబారకుండా మాట స్పష్టత వస్తుంది.

పూజ అనేది హైందవి ధర్మం. అది అందరూ పాటిస్తే ఆరోగ్యం. అందుకే ప్రతి రోజు పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు. అసలు విషయం చేయక అపార్థాలను చేసుకునే వారికి కనువిప్పు కలగాలనే ఈ కథనం మీ ముందుంచుతున్నాము. దైవారాధనలో మీరూ లీనమై ఆ దేవుని ఆశిస్సులను పొంది దీర్ఘాయువులుగా ఉంటారని ఆశిస్తున్నాము.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

8 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

14 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

22 hours ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

2 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

2 days ago

Political News: ఏపీలో పవన్.. తెలంగాణలో రేవంత్: ఇద్దరి ప్లాన్ ఒక్కటేనా?

Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…

2 days ago

This website uses cookies.