Technology: వాట్సాప్ వినియోగం ప్రస్తుతం దైనందిన జీవితంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి లైఫ్ లో భాగం అయిపొయింది. వాట్సాప్ కారణంగా సందేశాలు పంపించుకోవడం సులభతరం అయిపొయింది. అలాగే గ్రూప్స్ పెట్టుకొని కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా వాట్సాప్ వెసులుబాటు కల్పించింది. అలాగే వీడియో కాల్స్, గ్రూప్ వీడియో కాల్స్ సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఫైల్ ట్రాన్స్ ఫర్ సర్వీస్ కూడా ఉంది. ఇక గతంలో 500 మంది వరకు మాత్రమే వాట్సాప్ గ్రూప్స్ లో మెంబర్స్ ని యాడ్ చేయడానికి అవకాశం ఉండేది.
అయితే ఇప్పుడు ఆ నెంబర్స్ జాబితా వెయ్యికి పెంచడానికి పేస్ బుక్, వాట్సాప్ యాజమాన్యం సిద్ధం అయ్యింది. ఇక కమ్యూనికేషన్ వ్యవస్థని మరింత విస్తృతం చేయడానికి కొత్త కొత్త అప్డేట్స్ ని వాట్సాప్ లో ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు. అదే సమయంలో సెక్యూరిటీ అలర్ట్స్ కూడా డిఫాల్ట్ గా రన్ అవుతున్నాయి. కొంత మంది ఈ వాట్సాప్ గ్రూప్ లని తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తున్నారు. విద్రోహ భావజాలాన్ని స్ప్రెడ్ చేయడానికి, అలాగే దేశ తప్పుడు వార్తలని స్ప్రెడ్ చేసి సమాజంలో అశాంతి పెంచడానికి వాట్సాప్ గ్రూప్ లని వినియోగిస్తున్నారని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఏదైనా ఒక సమాచారం మన దగ్గరకి వచ్చినపుడు ఒకటికి రెండు సార్లు దానిని నిర్ధారించుకొని ఫార్వార్డ్ చేసే ప్రయత్నం చేయాలని, ఒక వేళ డౌట్ ఉంటే తక్షణమే అలాంటి సందేశాల్ని డిలేట్ చేయడం ఉత్తమం అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.