Health Tips: మన రోజువారి ఆహారపు అలవాట్లు జీవన విధానాల కారణంగా ప్రస్తుత జీవితంలో చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఉబకాయం, బిపి, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రస్తుతం ప్రజలను భయపెడుతున్నాయి. ఆహారపు అలవాటులో మార్పుల కారణంగా అలాగే మార్కెట్లో దొరికే ప్యాకేజ్ ఫుడ్స్ కారణంగా ఎక్కువగా ప్రజలు ఇలా రోగాల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే దయనందిన జీవితంలో చాలా మంది ఆహారపు అలవాట్ల విషయంలో పెద్దగా మార్పు ఉండడం లేదు. ఈ కారణంగానే 50 ఏళ్లు రాకుండానే చాలామంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు.
ఇండియాలో 2022 లెక్కల ప్రకారం 80 మిలియన్స్ ప్రజలు డయాబెటిస్ బారిన పడినట్లుగా అంచనా వేస్తున్నారు. 2045 నాటికి ఈ డయాబెటిస్ రోగుల సంఖ్య 135 మిలియన్స్ కి చేరుతుందని భావిస్తున్నారు ప్రస్తుత ఇండియా జనాభాలో 17% మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఓ విధంగా ప్రపంచాన్నే కాకుండా ఇండియాని కూడా ఈ డయాబెటిస్ భయపెడుతుంది అని చెప్పాలి. అయితే డయాబెటిస్ మనిషిని చంపేసే అంత ప్రమాదకరమైన వ్యాధి అయితే కాదు. కానీ ఒక్కసారి ఈ వ్యాధి బారిన పాడిన తర్వాత కచ్చితంగా ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిందే.
లేదంటే తొందరగా మనిషిని శారీరకంగా డయాబెటిస్ బలహీనంగా మార్చి మరణానికి దగ్గర చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అయితే కొన్నింటిని మాత్రం తినడం ద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. పండ్లను తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చాలామంది భావిస్తారు. అలాగే షుగర్ వ్యాధి పెరగడానికి కారణమయ్యే అన్నం ఇడ్లీ వంటివి తింటూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
బొప్పాయి, కర్బూజా, జామ, పుచ్చకాయ, కమలా, పైనాపిల్, యాపిల్, నేరేడు, రేగి పండ్లు తినడం వలన షుగర్ వ్యాధి పెరగకుండా అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఈ పండ్లలో ఉండే చక్కెరలు ప్రక్టోజ్ రూపంలో ఉండడం వలన శరీరానికి హానికరం కాదని సూచిస్తున్నారు. అలాగే జన్యు పరంగా కూడా ఈ షుగర్ డయాబెటిస్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలు తీసుకునే కచ్చితంగా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.