Categories: LatestNewsPolitics

Vizag: ఏపీకి ఒక్కటే రాజధాని అంట… మిగిలినవన్నీ వట్టి కథేనా?

Vizag: ఆ మధ్య ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజధాని విశాఖపట్నం అని, తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్న అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసి ఒక్కసారిగా ఏపీకి ఒకటే రాజధాని అది విశాఖపట్నం మాత్రమే అని చెప్పడం ద్వారా వైసీపీ స్టాండ్ మారిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బెంగుళూరులో పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఐటీ మంత్రి అమర్నాథ్, ఆర్ధిక మంత్రి బుగ్గన పాల్గొన్నారు.

vizag-is-the-future-capital-for-ap

ఈ సందర్భంగా జరిగిన సెమినార్ లో ఏపీకి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ లేదని, కేవలం విశాఖపట్నం మాత్రమే రాజధాని అని చెప్పారు. అమరావతిలో కేవలం ఏడాదిలో ఒకసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రమే జరుగుతాయని తెలిపారు. అలాగే కర్నూల్ లో ఏర్పాటు చేసేది హైకోర్టు బెంచ్ మాత్రమే అని చెప్పారు. విశాఖపట్నం నుంచి ప్రభుత్వం పరిపాలన మొదలుపెడుతుంది అని క్లారిటీ ఇచ్చారు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉందని దానిని ఇస్తామని కూడా బుగ్గన, అమర్ నాథ్ తెలియజేశారు.

 

అలాగే మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ప్రైవేట్ పరిశ్రమలకి అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది అని తెలిపారు. ఇదిలా ఉంటే బుగ్గన చేసిన కామెంట్స్ ద్వారా మూడు రాజధానులు అంటూ వైసీపీ సర్కార్ ఇన్ని రోజులు ప్రజలని మోసం చేస్తూ వస్తుందనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొచ్చాయి. వారి దృష్టి అంతా విశాఖపట్నం మీదనే ఉందని, అక్కడి ప్రకృతి వనరులని ద్వంసం చేసి దోచుకోవడానికి రాజధానిగా మారుస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇన్ని రోజులు వారు చెప్పిన మాటని మళ్ళీ వారే అబద్ధం అని క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. అయితే మూడు రాజధానులు అంటూ మభ్య పెట్టిన వైసీపీకి ఇప్పుడు ఒకే రాజధాని అని చెప్పడం ద్వారా కచ్చితంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

TDP PARTY: టీడీపీకి రాజ్యసభ గండం.. లోకేష్ ఎంట్రీతో సీన్ మారుతుందా?

TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…

21 minutes ago

Telangana: జనసేన సభకు నో పర్మిషన్.. రూటు మార్చిన‌ పవన్..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…

2 hours ago

Andhra Pradesh: రాపాక, ఆమంచి.. ఈ ఇద్ద‌రు ఏ పార్టీలో ఉన్నార‌బ్బా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…

2 hours ago

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

7 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

18 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

1 day ago

This website uses cookies.