v-v-lakshminarayana-will-join-aam-aadmi-party
V. V. Lakshminarayana:
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకొని పేద ప్రజల పార్టీగా మన్ననలు అందుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లగా తన ప్రస్థానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలో రాబోయే కర్ణాటక ఎన్నికలలో గట్టిగా ప్రభావం చూపించాలని భావిస్తున్నారు. కర్ణాటకలో బలమైన స్థానాలలో గెలుపొందడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్న బెంగుళూరు, మైసూరు జిల్లాలలో దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. మరో వైపు తెలుగు రాష్ట్రాలలో కూడా అం ఆద్మీని విస్తరించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపిస్తున్నారు.
ఇక ఏపీలో అదే కేసీఆర్ సహాయం తీసుకొని పార్టీని విస్తరించాలని భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఏపీలో ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తున్న మంచి బ్యాగ్రౌండ్ ఉన్న నాయకులని గాలం వేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగా జేడీ లక్ష్మినారాయణతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. జేడీ లక్ష్మినారాయణని ఏపీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా బాద్యతలు ఇవ్వాలని భావిస్తున్నారు. కాస్తా చరిష్మాటిక్ లీడర్ గా, విలువలు ఉన్న వ్యక్తిగా లక్ష్మినారాయణకి గుర్తింపు ఉంది.
ఈ నేపధ్యంలో అతనికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే కచ్చితంగా ప్రజలలోకి బలంగా వెళ్ళడానికి అవకాశం వస్తుందని భావించి కేజ్రీవాల్ ఆదిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. కేసీఆర్ ఈ విషయంలో కేజ్రీవాల్ కి సహకరిస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. కచ్చితంగా పార్టీ విస్తరణ ఏపీలో భవిష్యత్తులో బలమైన పునాదులు దిశగా కొనసాగుతున్నాయనే మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరో వైపు బీఆర్ఎస్ పార్టీని కూడా ఏపీలో విస్తరించాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ అక్కడ బలమైన కాపు సామాజిక వర్గాన్ని తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత వరకు
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.