Science: ఖగోళంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల ఉనికిపై నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని దేశాలు విశ్వంపై ఆధిపత్యం కోసం వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతూ ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఇండియా ఓ వైపు గ్రహాల ఉనికిపై, అంతరిక్ష పరిశోధనలు ఎన్నో చేస్తుంది. దీనికోసం రాకెట్స్ ని ప్రయోగిస్తుంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్రహాలని గుర్తిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భూమిపై కాకుండా ఇతర గ్రహాలలో జీవం ఉనికి గురించి పరిశోధనలు చేస్తున్నారు. అలాగే నీరు ఉన్న చోట జీవం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో నీటి ఉనికి ఎక్కడ ఉందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నాసాకి చెందిన హబుల్ టెలిస్కోప్ రెండు కొత్త గ్రహాలని గుర్తించింది. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్నట్లు కూడా టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. అయితే ఇవి మన నక్షత్ర మండలంలో కాకుండా 218 కాంతి సంవత్సరాల దూరంలో లీరా నక్షత్ర మండలంలో ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్న నక్షత్రం మరుగుజ్జు నక్షత్రంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్న నేపధ్యంలో జీవానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా నాసా పరిశోధకులు చెబుతున్నారు.
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…
This website uses cookies.