Science: ఖగోళంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల ఉనికిపై నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని దేశాలు విశ్వంపై ఆధిపత్యం కోసం వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతూ ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఇండియా ఓ వైపు గ్రహాల ఉనికిపై, అంతరిక్ష పరిశోధనలు ఎన్నో చేస్తుంది. దీనికోసం రాకెట్స్ ని ప్రయోగిస్తుంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్రహాలని గుర్తిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భూమిపై కాకుండా ఇతర గ్రహాలలో జీవం ఉనికి గురించి పరిశోధనలు చేస్తున్నారు. అలాగే నీరు ఉన్న చోట జీవం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో నీటి ఉనికి ఎక్కడ ఉందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నాసాకి చెందిన హబుల్ టెలిస్కోప్ రెండు కొత్త గ్రహాలని గుర్తించింది. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్నట్లు కూడా టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. అయితే ఇవి మన నక్షత్ర మండలంలో కాకుండా 218 కాంతి సంవత్సరాల దూరంలో లీరా నక్షత్ర మండలంలో ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్న నక్షత్రం మరుగుజ్జు నక్షత్రంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్న నేపధ్యంలో జీవానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా నాసా పరిశోధకులు చెబుతున్నారు.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.