Tollywood : విలేజ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ను విడుదల చేశారు.
80 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో అన్ని రకాల ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, లవ్, థ్రిల్లర్ జానర్లను చూపించారు. ‘కళ్లు మోసం చేశాయేమో అని నువ్ అంటున్నావ్.. కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా’.. ‘వయసైపోయాక తండ్రిని వదిలేసే కొడుకులు ఉన్నారు కానీ.. చెడిపోయాడని కొడుకుని వదిలేసే తండ్రులు లేరు’.. అంటూ సాగే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.