Tollywood: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే సాధించినప్పటికీ.. నార్త్ బెల్ట్, ఓవర్సీస్ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లెక్కలపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ తీసుకున్న భారీ పారితోషికం, అందులో ఆయన చేసిన త్యాగం ఇప్పుడు హాట్ డిస్కషన్కు దారితీసింది.
ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు రూ. 120 కోట్ల భారీ రెమ్యునరేషన్ను అగ్రిమెంట్ చేసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే, సినిమా అనుకున్న రేంజ్లో హిట్టు కాకపోవడం, విదేశాల్లో ఆశించిన అంకెలు రాకపోవడంతో నిర్మాత సేఫ్ జోన్లోకి రావడం కోసం చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం సినిమా పూర్తయిన తర్వాత నిర్మాత నుంచి చరణ్కు అందాల్సిన పారితోషికంలో ఒక పెద్ద మొత్తాన్ని ఆయన వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అంటే.. బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ అనుకున్నంత రేంజ్ అందుకోకపోవడంతో వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు, నిర్మాతకు ఊరట కలిగించేందుకు చరణ్ తన సొంత లాభాన్ని వదులుకున్నాడట.
కేవలం రామ్ చరణ్ మాత్రమే కాకుండా, దర్శకుడు బుచ్చిబాబు సైతం నిర్మాత శ్రేయస్సు కోరి తన రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని వదులుకున్నట్లు ఇన్సైడ్ టాక్. నార్త్, ఓవర్సీస్ మార్కెట్లలో లెక్కలు సరిగ్గా కుదిరి ఉంటే ‘పెద్ది’ రేంజ్ వేరేలా ఉండేది అని నిర్మాత సతీష్ కూడా బహిరంగంగానే అంగీకరించారు. అయితే, కమర్షియల్ అంకెలు ఎలా ఉన్నప్పటికీ.. ఒక నటుడిగా రామ్ చరణ్కు ఈ సినిమాతో అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం చరణ్లోని నటనను పూర్తి స్థాయిలో చూడటం సంతోషాన్ని ఇచ్చిందని ప్రత్యేకంగా అభినందించారు.
Tollywood: 90వ దశకంలో తనదైన నటనతో, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వడ్డే నవీన్.…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతం ఇకపై కేవలం అలల సవ్వడికే పరిమితం కాబోవడం లేదు. పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి…
Heart stroke: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు అధికమవుతున్న సంగతి తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య కూడా…
YCP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం కొంతకాలంగా బెంగళూరు ప్యాలెస్,…
Srivari Arjitha Seva : కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మళ్లీ పులుల గర్జనలు మిన్నంటబోతున్నాయా? నల్లమల అడవులకు పూర్వవైభవం రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి…
This website uses cookies.