Categories: Health

Dengue: డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారా… వెంటనే కోలుకోవాలంటే ఇలా చేయాల్సిందే!

Dengue: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పెద్ద ఎత్తున దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అయితే ఈ దోమ కాటు వల్ల మనం ఎన్నో రకాల జబ్బులకు గురి అవుతాము. ప్రస్తుతం ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలా మంది జ్వరాల బారిన పడి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ముందుగా మనం ఈ భయంకరమైనటువంటి వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం ముఖ్యంగా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి.

ఇక ఎవరైతే డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంటారో అలాంటివారు ఈ వ్యాధి నుంచి బయటపడాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఎక్కువ శాతం పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల తేలికగా జీర్ణం ఇవ్వడమే కాకుండా మన శరీరంలో రక్త కణాల సంఖ్యను పెంపొందింప చేస్తాయి. దీంతో తొందరగా ఈ డెంగ్యూ వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. మరి డెంగ్యూ వ్యాధితో బాధపడేవారు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే విషయానికి వస్తే…

బొప్పాయి ఆకులు డెంగ్యూతో పోరాడడానికి మంచి ఔషధంగా సూచించారు. బొప్పాయి ఆకుల రసం మన శరీరంలో ప్లేట్లెట్స్ పెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయి. ఈ వ్యాధితో బాధపడేవారు తొందరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం అందుకే అరటి పండును తీసుకోవడం వల్ల తొందరగా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు ఇందులో ఉన్నటువంటి పొటాషియం, విటమిన్ b6, మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి అనారోగ్యం నుంచి కొలుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితోపాటు దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ కివి ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడమే కాకుండా మన శరీరంలో ప్లేట్లెట్స్ పెరిగి తొందరగా ఈ వ్యాధి నుంచి బయటపడతాము.

Sravani

Recent Posts

Andhra Pradesh: రాపాక, ఆమంచి.. ఈ ఇద్ద‌రు ఏ పార్టీలో ఉన్నార‌బ్బా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…

16 minutes ago

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

5 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

16 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

22 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

3 days ago

This website uses cookies.