Srivari Arjitha Seva : కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అదే విధంగా స్వామివారి సేవలో భాగంగా ఎంతోమంది సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే స్వామివారి స్పెషల్ దర్శనం కోసం, సేవ కోసం ముందస్తుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారి ఉచిత దర్శనం కోసం వెళ్లేవారు ఉంటారు అలాగే ప్రత్యేక దర్శనాలు, సర్వదర్శనానికి వివిధ రకాల టికెట్లను కొనుగోలు చేస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అంటే రూ.10,500 టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఇంత ధరలో కాకుండా కేవలం 120 రూపాయలకు మాత్రమే మొదటి గడప దర్శనం చేసుకుని అవకాశాన్ని టిటిడి కల్పించారు. ఇలా స్వామివారి మొదటి గడప దర్శనం కోసం ఎలక్ట్రానిక్ ఈ-డిప్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ప్రతీ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లక్కీ డిప్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్న కొంతమందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.
ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మొత్తం 4 రకాల దర్శనాలు అందుబాటులో ఉంటాయి.సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవ, అష్టాదళ పాద పద్మారాధన అని వేర్వేరు సేవలు ఉంటాయి. ఇందులో అతి తక్కువ టికెట్ ధర సుప్రభాత సేవకు రూ.120గా ఉంటుంది. ఈ టికెట్ పొందడం కోసం టీటీడీ యాప్, వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత శ్రీవారి ఆర్జిత సేవ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.ప్రతీ నెల 18వ తేదీన ఉదయం 8 గంటలకు ఈ ఈ-డిప్ ప్రారంభం అవుతుంది. 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయి. ఇక అదే 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు.. ఈ ఈ-డిప్లో సెలెక్ట్ అయిన వారికి మెసేజ్లు వస్తాయి. దానికి సంబంధించిన పేమెంట్ను చేస్తే.. టికెట్ బుక్ అవుతుంది. ఏ తేదీ టికెట్ బుక్ అవుతుందో ఆ సమయానికి తిరుమలకు వెళ్లి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. మూడు నెలలకు ముందుగానే ఈ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది జూన్ నెలలో బుక్ చేసుకుంటే సెప్టెంబర్ లో స్వామివారి దర్శనం కలుగుతుంది.
Tollywood: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పెద్ది’ సినిమా…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతం ఇకపై కేవలం అలల సవ్వడికే పరిమితం కాబోవడం లేదు. పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి…
Heart stroke: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు అధికమవుతున్న సంగతి తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య కూడా…
YCP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం కొంతకాలంగా బెంగళూరు ప్యాలెస్,…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మళ్లీ పులుల గర్జనలు మిన్నంటబోతున్నాయా? నల్లమల అడవులకు పూర్వవైభవం రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి…
Friday Pooja: మన హిందూ సంప్రదాయాల ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శుక్రవారం మహాలక్ష్మికి పూజ చేయడం వల్ల…
This website uses cookies.