Fruits: ప్రస్తుత కాలంలో చాలామంది పండ్లు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండాలని ఫ్రిజ్లో నిల్వ చేస్తూ ఉంటారు అయితే ఇలా ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా తాజాగా ఉంటాయని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టడం వల్ల పూర్తిగా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. మనం ఏ పనులను ఫ్రిజ్లో పెట్టకూడదు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
ఫ్రిజ్లో ఎలాంటి పరిస్థితులలోనూ మామిడి, అరటి, పుచ్చకాయ, లిచి పెట్టకూడదు ఇలా వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల వీటిలో ఉన్నటువంటి పోషకాలు నశించిపోతాయి. అందుకే వీటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు. మామిడి పండ్లను ఫ్రిజ్లో ఉంచడం వల్ల శీతలీకరణ చెంది మామిడిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను తగ్గిపోతాయట. అందుకే వీటిని పెట్టకూడదు. లిచీ పండ్లను ఫ్రిజ్లో ఉంచి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. మార్కెట్ నుంచి తెచ్చిన రోజునే తినడం మంచిది.
పుచ్చకాయను చల్లగా తినడానికి ఫ్రిజ్లో పెడుతుంటారు. పుచ్చకాయను కోసి ఫ్రిజ్లో ఉంచి.. చల్లగా అయిన తర్వాత తింటే పుచ్చకాయలోని పోషకాలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండును ఫ్రిజ్ లో పెట్టాల్సి వస్తే కట్ చేయకుండా పెట్టుకోవడం మంచిది. యాపిల్ పోషకాలు అధికంగా ఉండే పండు. యాపిల్ను ఫ్రిజ్లో ఉంచితే వాటిలోని పోషకాలు పోతాయంటున్నారు. ఒకవేళ తప్పనిసరిగా యాపిల్స్ను ఫ్రిజ్లో ఉంచవల్సి వస్తే.. వాటిని కాగితంలో చుట్టి ఫ్రిజ్లో ఉంచవచ్చు. ఇక అరటి పండ్లను కూడా ఫ్రిజ్లో పెట్టడం మంచిది కాదు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.