tdp-leaders-worrying-about-jumping-leaders-from-ycp
AP Politics: అధికార వైసీపీ పార్టీలో రోజురోజుకి అసమ్మతి నాయకులూ పెరిగిపోతున్నారు. సుమారు 50 మందికి పైగా బయటకి చెప్పకపోయిన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తూ వాటిని కూడా బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్స్ కి పడేలా చేస్తున్నారు. ఇక నియోజకవర్గాల అభివృద్ధికి ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో హామీ ఇచ్చిన పనులని కూడా ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారు. దీంతో వారిలో తెలియని అసహనం నెలకొని ఉంది. అయితే అభివృద్ధి చేయకుండా ఇంటింటికి వెళ్లి జగనన్న అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పమని వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకి ఫోర్స్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో అంతర్గతంగా ఇప్పటికే వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తి జ్వాలలు నెల్లూరు జిల్లాలో మొదటిగా బయటపడ్డాయి. మెల్లగా మిగిలిన జిల్లాలకి కూడా విస్తరిస్తుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే వచ్చే ఎన్నికలలో కనీసం 50 మంది సిట్టింగ్ లకి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ వర్గాలలో కూడా వినిపిస్తుంది. అయితే వీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు దిక్కులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో తెలుగుదేశం గూటికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే టికెట్ లు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలో అసంతృప్తుల కారణంగా ఇప్పుడు ఎక్కడ తమ స్థానాలు గల్లంతు అవుతాయో అని ఇన్ని రోజులు పార్టీకి ఇన్ చార్జ్ లు పనిచేస్తున్న వారు భయపడుతున్నారు. ఈ వైసీపీ వారికి చంద్రబాబు సీట్లు ఇచ్చి మమ్మల్ని పక్కన పెడితే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ చేరికలపై రియాక్ట్ కానంత వరకు సైలెంట్ గా ఉండాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇక టీడీపీలో సీట్లు రావు అనుకున్నవారు జనసేన వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
Swayambhu: బాహుబలి ని గుర్తు చేస్తున్న స్వయంభు టీజర్..నిఖిల్ రేంజ్ మారుతుందా?..అవును తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పాన్…
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
This website uses cookies.