YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసిపి మరల 2024 ఎన్నికలలో గెలవడానికి వ్యూహాలు వేసుకుంటూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తోంది. ఇప్పటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను అధికార పార్టీ నిర్వహిస్తోంది. గ్రామ సారధులను ఏర్పాటు చేసుకొని ఇంటింటికి వెళ్లి తమ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ అధికార పార్టీ ఉద్యోగాల కల్పన, పారిశ్రామికీకరణ, అభివృద్ధి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రజలలో కూడా వైసిపిపై కొంత నెగిటివ్ టాక్ ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్ కి మరో రూపంలో కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇప్పటికే నియోజకవర్గాలలో కొత్త నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైసీపీ నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, సీనియర్ నాయకులుగా ఉన్న వారు తమ వారసులను బరిలోకి దించాలని భావిస్తున్నారు. రాయలసీమలో చంద్రగిరి నియోజకవర్గం ఎమెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని ప్రకటించారు. అలాగే మచిలీపట్నంలో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. బొత్స సత్యనారాయణ తనయుడు కూడా ఎమ్మెల్యేగా 2024 లో ఎంట్రీ ఇవ్వ్వాలనే ఆలోచనతో ఉన్నారు.
వైసీపీలో ఇలా మొత్తం 40 మంది వరకు వారసులు అరంగేట్రం చేయడానికి ఆశపడుతున్నారు. నాయకులు కూడా తమ కొడుకులు లేదా కూతుళ్లకు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోవడానికి విశ్వం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో జగన్ కాస్త ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వారసులకు ఎమ్మెల్యే సీట్లు ఖరారు చేసి ఇస్తే వారు ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది అర్థం కాని విషయం. ప్రజల్లోకి వారు బలంగా వెళ్లలేకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది మరి దీనిపై ఫైనల్ గా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.