Mahalaya Paksham:భాద్రపదమాసంలో శుక్లపక్షంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఇక బహుళపక్షంలో కృష్ణపక్షం పితృకార్యాలకు విశేషం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షముగా పిలుస్తారు. ఏడాదికి 12 అమావాస్యలుంటాయి. కానీ, భాద్రపద అమావాస్యకు ఎంతో విశిష్ఠత ఉన్నది. ఈ ఏడాది ఈ నెల 18 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై.. అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరించుకోవడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ మహాలయపక్షంలో ప్రతిరోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి.. పితృ దేవతలను సర్మించుకోవాలి.తద్వారా ఆయుః ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక పితృదేవతలకు పిండ ప్రధానలు చేయడానికి మహాలయ పక్షం ఎంతో శుభమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. కుదరి పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథిరోజైతే కన్నుమూశారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఒకవేళ తిథి రోజున వీలు కాకపోయినా అమావాస్య రోజున పిండ ప్రధానాలు చేయడం మంచిది.
ఇలా ఈ మహాలయ పక్షంలో మరణించిన మన పెద్దవారిని స్మరించుకొని వారికి తర్పణాలు చేయటం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. అలాగే వారి ఆశీస్సులు కూడా మనపై ఉండి మనపై ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ 15 రోజులు ఎంతో నియమ నిష్టలను పాటిస్తూ పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో మంచిది.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.