Mahalaya Paksham:భాద్రపదమాసంలో శుక్లపక్షంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఇక బహుళపక్షంలో కృష్ణపక్షం పితృకార్యాలకు విశేషం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షముగా పిలుస్తారు. ఏడాదికి 12 అమావాస్యలుంటాయి. కానీ, భాద్రపద అమావాస్యకు ఎంతో విశిష్ఠత ఉన్నది. ఈ ఏడాది ఈ నెల 18 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై.. అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరించుకోవడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ మహాలయపక్షంలో ప్రతిరోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి.. పితృ దేవతలను సర్మించుకోవాలి.తద్వారా ఆయుః ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక పితృదేవతలకు పిండ ప్రధానలు చేయడానికి మహాలయ పక్షం ఎంతో శుభమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. కుదరి పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథిరోజైతే కన్నుమూశారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఒకవేళ తిథి రోజున వీలు కాకపోయినా అమావాస్య రోజున పిండ ప్రధానాలు చేయడం మంచిది.
ఇలా ఈ మహాలయ పక్షంలో మరణించిన మన పెద్దవారిని స్మరించుకొని వారికి తర్పణాలు చేయటం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. అలాగే వారి ఆశీస్సులు కూడా మనపై ఉండి మనపై ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ 15 రోజులు ఎంతో నియమ నిష్టలను పాటిస్తూ పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో మంచిది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.