Pooja Room: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఎంతో శుభం కలుగుతుంది ఆ ఇంటి పై సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేస్తూ ఉంటాము అయితే దీపారాధన చేయడం కోసం పూజ గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. చాలామంది పూజ గదికి తలుపులు కూడా ఏర్పాటు చేసుకొని ఉంటారు.
ఇలా పూజ చేసిన తర్వాత పూజ గదికి ఉన్నటువంటి తలుపులను మూసేయవచ్చా లేదా తెరిచే ఉంచాలా అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. మరి పూజ చేసిన తర్వాత పూజగది విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పూజ చేస్తున్న తర్వాత వెంటనే పొరపాటున కూడా పూజగదికి తలుపులు వేయకూడదు కొంత సమయం ఉంచిన తర్వాత తలుపులు మూసుకోవచ్చు కానీ వెంటనే తలుపులు మూయకూడదు. ఇక మనం వెలిగించిన దీపాలు ఆరిపోతున్నాయన్న క్రమంలో మాత్రమే తలుపులు వేయాలి.
ఇక పూజ గదిలో ఎక్కువగా రాగి వస్తువులు ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ దేవుడి విగ్రహాలను మాత్రం పెట్టుకోకూడదు. దేవుడి ఫోటోలను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ విగ్రహాలను ఏర్పాటు చేయకూడదు. అదేవిధంగా పూజ గది ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి తప్ప చిందరవందరగా ఉండకూడదు. ఇకపోతే స్వామివారికి ఎల్లప్పుడూ శుభ్రమైనటువంటి పువ్వులను పెట్టాలి ఎప్పుడు వాడిపోయిన పువ్వులను పెట్టకూడదు అదేవిధంగా దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలను పొరపాటున కూడా పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.