Samantha: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా ఆమె కెరియర్ ముగిసింది అని చెప్పాలి. ఇప్పుడు ఫిమేల్ సెంట్రిక్ కథలతో తనని తాను సోలోగా ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉంది. అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
ఇందులో భాగంగానే గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. కెరియర్ లో సోలోగా ఏకంగా 50 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి మూవీ కూడా అన్ని భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సమంతా మయోసైటిస్ నుంచి రికవరీ కావడంతో ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్ ల మీద దృష్టి పెట్టింది. అలాగే తన దృష్టి మొత్తం ఇప్పుడు బాలీవుడ్ పై ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగులో ఫిమేల్ సెంట్రిక్ కథలు మాత్రమే చేస్తూ బాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కావాలని అనుకుంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ తో తనని బాలీవుడ్ కి పరిచయం చేసిన రాజ్ అండ్ డీకే కాంబినేషన్ లో సిటాడెల్ రీమేక్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఇందులో తెరకెక్కుతుంది.
ఇందులో వరుణ్ ధావన్ కూడా హీరోగా నటిస్తూ ఉండగా సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన ఫేమ్ మారుతుందని సమంతా భావిస్తుంది. ఈ నేపధ్యంలో ఆమె ముంబైకి షిఫ్ట్ అయ్యేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె ముంబైలో 15 కోట్లు పెట్టి ఓ హౌస్ కూడా కొన్నదని టాక్. త్వరలో దీనికి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. హైదరాబాద్ లో ఉంటే గత జ్ఞాపకాలు గుర్తుకోస్తాయని ఆమె ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
This website uses cookies.