Salaar: ‘సలార్’ షూటింగ్ కి పట్టిన రోజులు 114 అని ఇప్పుడు ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ప్రభాస్, శృతి హాసన్, పృథ్విరాజ్, జగపతిబాబు లాంటి స్టార్ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘కేజీఎఫ్’ కంటే భారీ ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజై యూట్యూబ్ ని వణికించింది.
ప్రభాస్ నుంచి ఎలాంటి యాక్షన్ సినిమా కోరుకుంటున్నారో అలాంటి సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో వస్తుందని ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలవుతాయని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే, ట్రైలర్ చూసిన తర్వాత మేకింగ్ కోసం ప్రశాంత్ నీల్ తీసుకుంది కేవలం 114 రోజులే అని, ఈ విషయంలో రాజమౌళి కంటే ఆయనే బెస్ట్ అని చెప్పుకుంటున్నారు.
Salaar: ప్రశాంత్ నీల్ రాజమౌళికి పోటీ అవుతాడని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే, కేజీఎఫ్ సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ రాజమౌళికి పోటీ అవుతాడని చెప్పుకుంటున్నారు. కేవలం మేకింగ్ పరంగా మాత్రమే కాదు అన్నీ విషయాలలో రాజమౌళిని అతి త్వరలో దాటే దర్శకుడు ప్రశాంత్ నీల్ అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజమౌళి కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ తీసింది లేదు. సినిమా సినిమాకి ఎదుగుతూ వచ్చారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆస్కార్ కూడా అందుకున్నారు. అంత గొప్ప దర్శకుడిని ప్రశాంత్ నీల్ ఇంత ఈజీగా దాటగలడా..? అని మరో మాట వినిపిస్తుంది. కానీ, అవకాశాలైతే లేకపోలేదు. అదే గనక జరిగితే రాజమౌళి తలదన్నే దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ని చెప్పుకోవడం ఖాయం. కాబట్టే , ప్రభాస్..ఎన్.టి.ఆర్, రాం చరణ్, అల్లు అర్జున్ లాంటి వారు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.