Categories: DevotionalLatestNews

Puranapanda: శ్రీనివాస్ ‘శ్రీమాలిక’ పరిమళాల మధ్య ఘనంగా కృష్ణయ్య జన్మదిన వైభవం

Puranapanda: హైదరాబాద్, మే 25: భారతీయ నాగరికతలకు మూలమైన సంస్కృతిని, సంస్కృత భాషలోనున్న శాస్త్రాలని సంరక్షించుకోకపోతే రేపటి తరాలకు బలమైన పవిత్ర జీవన విధానం ఇవ్వలేమని కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య పేర్కొన్నారు. వేద వేదాంగపారంగతులైన బ్రహ్మవేత్తల వైదిక మంత్రాలమధ్య మణికొండలోని స్పటికలింగేశ్వరునికి బొల్లినేని కృష్ణయ్య తన జన్మదినోత్సవ సందర్భంగా శతరుద్రీయ మంత్రాలతో మహారుద్రాభిషేకం తదితర మన్యుసూక్త ఏకాదశ పారాయణాలు ఘనంగా నిర్వహించారు.

puranapanda-krishnaiahs-birthday-celebrated-in-grand-style-amidst-srinivas-srimalika-perfumes

Puranapanda: పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనం

puranapanda-krishnaiahs-birthday-celebrated-in-grand-style-amidst-srinivas-srimalika-perfumes

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, భగవంతుని ఎదుట కూర్చుని చేసే ప్రార్ధన, స్మరణ హృదయపూర్వకమై వున్నప్పుడే సాధన ఫలిస్తుందని వివరిస్తూ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనం శ్రీమాలిక అపురూప గ్రంధాన్ని ఇటీవల తాను శ్రీశైల క్షేత్రంలో ఎంతోమందికి బహూకరించినప్పుడు వచ్చిన స్పందన అనూహ్యమని, ఇది శ్రీనివాస్ స్వయంప్రతిభపై భగవంతుని మహాబలం అనుగ్రహమై వర్షించడమేనన్నారు.
ఈ సందర్భంగా పలువురు అర్చకులకు, వేదపండితులకు కృష్ణయ్య శ్రీమాలిక బహూకరించారు. ఈ సందర్భంలో వేద విద్యల, శ్రీవిద్యల మంత్రాలతో బొల్లినేని కృష్ణయ్యను మహోపాసకులైన వేదపండితులు శతమానంభవతి అంటూ ఆశీర్వదించిన వైదిక విధానం ప్రత్యేక విశేషంగానే పేర్కొనాలి.

ఇప్పటికే యాదాద్రి, వెంకటాద్రి, ఇంద్రకీలాద్రి మహాపుణ్యక్షేత్రాలలో వేల వేల భక్తులను ఆకట్టుకున్న పురాణపండ నాలుగు ప్రధాన పవిత్ర గ్రంధాలకు కిమ్స్ చైర్మన్ కృష్ణయ్య సమర్పకులు కావడం దైవఘటనేనని మేధో సమాజం కోడై కూస్తోంది. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ శ్రీమాలిక గ్రంధం ఇప్పటికి పదహారు పునర్ముద్రణలకు నోచుకోవడం ఈ రోజుల్లో ఆషామాషీ వ్యవహారంకాదని, శ్రీనివాస్ నిరంతర కృషీవలత్వాన్ని కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతి శ్రీమాలిక ఆవిష్కరణ సందర్భంలో మంగళాశాసనం చెయ్యడం కూడా శ్రీనివాస్ జీవన యాత్రలో ఒక మేలిమలుపుగా చెప్పాల్సిందే!

మొదట నూట అరవై పేజీలతో భక్త పాఠకులను ఆకట్టుకున్న శ్రీమాలిక గ్రంధం ఇప్పుడు నాలుగు వందల పేజీలతో అద్భుత ఆర్షభారతీయ విశేషాలతో ఆకర్షిస్తోందని ఇటీవల భారతమాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, తెలంగాణా శాసనమండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి ప్రశంసించడం గమనార్హం.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…

2 hours ago

Tuesday Auspiciousness: మంగళవారం కొత్త పనులు ప్రారంభించవచ్చా? మంచిదేనా?

Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…

2 hours ago

Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…

23 hours ago

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

1 day ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

1 day ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

2 days ago

This website uses cookies.