Prabhas Salaar : ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ లో ఓ కొత్త ఉత్సాహం వస్తుంది. అసలే ఫ్లాపులతో అప్సెట్ లో ఉన్న అభిమానులు ఎప్పుడెప్పుడా అని కోటి కళ్ళతో ప్రభాస్ నటించిన సలార్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి గ్రాండ్ గారిలీజ్ కాబోతోంది. ప్రభాస్ కి జోడీగా ఈ మూవీలో శృతి హాసన్ కనిపించునుంది. స్టార్ హీరో పృథ్వీరాజ్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సలార్ మొదటి భాగం ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ అని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ గా రిలీజైన సూరిడే సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తన స్నేహితుడిని రాజును చేయడం కోసం ప్రభాస్ అలియాస్ దేవా ఎలాంటి యుద్ధం చేశాడు అనేది ఈ స్టోరీ లో చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ ని దర్శకధీరుడు రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియోని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
గంటన్నర పాటు ఉన్న ఈ వీడియోలో జక్కన్న ప్రభాస్ తో పాటు మిగిలిన టీమ్ మెంబర్స్ ను సినిమాకు సంబంధించిన విషయాలు అడిగినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇక ఈ ఇంటర్వ్యూలోనే సలార్ సినిమా ఫస్ట్ టికెట్ ని రాజమౌళి కొన్నారట . నైజాం డిస్టిబ్యూటర్ ఉన్న మైత్రీ ప్రొడ్యూసర్ నుంచి తొలి టికెట్ ని రాజమౌళి కొనుగోలు చేశారు. ఈ విజువల్స్ ని ఈ వీడియోలో చూపించనున్నారట. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ఫైనల్ అవుట్ ఫుట్ ని రెడీ చేస్తున్నారని సమాచారం. అది పూర్తి కాగానే సోమవారం ఈ ఇంటర్వ్యూ ని రిలీజ్ చేసే ప్లాన్ చేశారు.
ఈ ఇంటర్వ్యూని అన్ని మీడియా ఛానల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. దీంతో మూవీపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకధీరుడు జక్కన్న ప్రమోషన్స్ లో దిగాడంటే సినిమాకి ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చినట్లే. ఈ ప్రభావం ఓపెనింగ్ డే కలెక్షన్స్ మీద ఉండనుంది. కేజీఎఫ్ సిరీస్ మీద కూడా జక్కన్న హ్యాండ్ పడిన తర్వాత పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సలార్ ప్రొమోషన్స్ లోనూ రాజమౌళి హ్యాండ్ పడింది. ఈ ఇంటర్వ్యూతోను ప్రభాస్ ఫ్యాన్స్ లో కొత్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని సినీ ఎనలిస్టులు అంటున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.