Politics: తెలంగాణపై మోదీ కన్ను.. రూటు మార్చిన రేవంత్‌..!

Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం.. ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీ వైపు మళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పొలిటికల్ రూట్ మార్చారు. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న గులాబీ దళాన్ని కాదని.. ఢిల్లీ పెద్దలపై, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఏకధాటిగా విమర్శనాస్త్రాలు సంధించడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తదుపరి పరిణామాల తర్వాత, బీజేపీ తన పూర్తి ఫోకస్‌ను దక్షిణాది రాష్ట్రాలపై, ముఖ్యంగా తెలంగాణపై పెట్టిందనేది బహిరంగ రహస్యం. గతేడాది పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 8 సీట్ల మైలేజ్‌తో కమలనాథులు ఈసారి తెలంగాణను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కర్ణాటకలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. బీజేపీ అధిష్టానం చూపు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కేంద్రీకృతమైంది. ఈ సౌత్ మిషన్ ను పసిగట్టిన రేవంత్ రెడ్డి.. ముళ్లని ముల్లుతోనే తీయాలనే చందంగా తన రూట్ మార్చారు.

politics-modi-sets-his-sights-on-telangana-revanth-changes-course

Politics: కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇప్పుడు సూటిగా టార్గెట్ చేస్తున్నారు.

కేంద్రంలో వరుసగా పదేళ్లుగా మంత్రిగా ఉంటూ.. వివాదాలకు దూరంగా, కేవలం ఢిల్లీ-హైదరాబాద్ ప్రయాణాలకే పరిమితమయ్యే కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇప్పుడు సూటిగా టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణలో పండిన 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. కేవలం ధాన్యమే కాదు.. మెట్రో రైలు విస్తరణ, మూసీ నది సుందరీకరణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం నుండి ఆశించిన సహకారం అందడం లేదని, దానికి కిషన్ రెడ్డి బాధ్యత వహించరా అంటూ నిలదీస్తున్నారు. చివరకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో ముడిపడి ఉన్న తుమ్మడిహట్టి ప్రాజెక్టు విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడే చొరవ కూడా కిషన్ రెడ్డి చూపడం లేదంటూ రేవంత్ విమర్శలు గుప్పించడం వెనుక పెద్ద స్కెచ్చే ఉంది.

నిజానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కానీ, గత అసెంబ్లీ పోరులో కానీ బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. అయితే, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న పట్టును ముందే దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడే రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ వర్కవుట్ అవుతోంది. తెలంగాణలో బీజేపీని ఎంతగా లైమ్‌లైట్‌లోకి తెస్తే.. అంతగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందనేది కాంగ్రెస్ లెక్క. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ట్రయాంగిల్ ఫైట్‌ను క్రియేట్ చేయడం ద్వారా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, 2028 నాటికి కాంగ్రెస్‌కు రూట్ క్లియర్ అవుతుందనేది ఈ వ్యూహం అంతరార్థం. మొత్తానికి మోదీ ఫోక‌స్ ను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి మార్చిన ఈ పొలిటికల్ రూట్.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త కాక రేపుతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

saliva onSleeping: నిద్రపోతున్నప్పుడు నోటి నుంచి లాలాజలం వస్తుందా? అశ్రద్ధ చెయ్యొద్దు?

saliva on Sleeping:  సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా…

9 hours ago

Tirumala SSD Tokens: శ్రీవారి భక్తులు అలర్ట్.. SSD దర్శన టోకెన్లు రద్దు చేసిన టీటీడీ..

Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…

10 hours ago

AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…

2 days ago

Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…

2 days ago

Tollywood: ఒకేసారి 3 సినిమాలతో మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…

2 days ago

Jamun Fruits: నేరేడు పండ్లను తినకుండా పక్కన పెడుతున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…

2 days ago

This website uses cookies.