Politics: మోదీకి 7 రోజులే టైమ్.. కొత్త పార్టీ అల్టిమేటం!

Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. గతంలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గుకుంటూ, వరుసగా మూడుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న మోదీ స‌ర్కారుకు ఇప్పటివరకు ఎవరూ గట్టిగా అల్టిమేటం జారీ చేసిన దాఖలాలు లేవు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం చేయని సాహసాన్ని.. ఇప్పుడు సరికొత్తగా ఆవిర్భవించిన ఒక రాజకీయ పార్టీ చేసి చూపించింది. మోదీ ప్రభుత్వానికి ఏకంగా 7 రోజుల గడువు విధిస్తూ సంచలన డిమాండ్ తెరపైకి తెచ్చింది.

‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే, ప్రధాని మోదీయే చొరవ తీసుకుని ఆయన్ను బర్తరఫ్ చేయాలని పట్టుబట్టారు.

politics-modi-has-only-7-days-new-partys-ultimatum

Politics: 12 ఏళ్ల మోదీ పాలనలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ

ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, కేంద్రం గనుక దిగిరాకపోతే అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. దేశంలో ఇటీవల కాలంగా విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ కొత్త పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా త్రిభాషా సూత్రాన్ని రుద్దాలని చూస్తోందని ఆరోపించింది. వీటన్నిటికంటే మిన్నగా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ‘నీట్’ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్రం వైఫల్యాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా విద్యాశాఖ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ.. రాబోయే ఏడు రోజుల్లో కేంద్రం తుది నిర్ణయం తీసుకోకపోతే దేశవ్యాప్త కార్యాచరణకు దిగుతామని సిజెపి హెచ్చరించింది.

మరోవైపు ఈ కొత్త పార్టీ డిమాండ్లు, అల్టిమేటంపై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అసలు ఈ పార్టీ ఉనికిని, నిరసనలను తాము అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు బీజేపీ ఎంపీలు కొట్టిపారేశారు. “ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే ఎవరైనా భయపడతారా? వాటిని తరిమికొడతారు. అలాగే ఈ కాక్రోచ్ పార్టీ చేసే చప్పుడును కూడా ఎవరూ పట్టించుకోరు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వింత చేష్టలు చేస్తున్నారు” అని ఒక అధికార ప్రతినిధి ఎద్దేవా చేశారు. ఏదేమైనా, 12 ఏళ్ల మోదీ పాలనలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ ఏడు రోజుల గడువు విధించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ 7 రోజుల్లో కేంద్రం స్పందిస్తుందా లేదా ఈ కొత్త పార్టీ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Retro Walk: వెనక్కి నడవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?ఒక్కసారి ట్రై చేయండి!

Retro Walk: ఇటీవల కాలంలో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయడం అనేది సర్వసాధారణం అయింది.…

15 hours ago

Shani Trayodashi 2026: నేడే శని త్రయోదశి..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

Shani Trayodashi 2026: మన హిందు సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించే వాటిలో శని త్రయోదశి కూడా ఒకటి.…

16 hours ago

Health Tips: అందం కోసం లిప్ స్టిక్ వాడుతున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Health Tips: అమ్మాయిలు ఎంత అందంగా తయారైన వారి అందాన్ని రెట్టింపు చేసేది మాత్రం పెదాలు అని మాత్రమే చెప్పాలి.…

2 days ago

Tirumala: వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ… వెయ్యి మందికి ఫ్రీ దర్శనం..

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇప్పటికే టీటీడీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.…

2 days ago

Andhra Pradesh: పాలిటిక్స్‌లోకి బాలయ్య చిన్న కూతురు.. పోటీ అక్క‌డి నుంచే..?

Andhra Pradesh: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? నందమూరి తారకరామారావు లెగసీని, నందమూరి బాలకృష్ణ…

2 days ago

Tollywood: శోభిత‌కు స‌మంత కౌంట‌ర్‌.. నెట్టింట అగ్గిరాజేస్తున్న కామెంట్స్!

Tollywood: టాలీవుడ్‌లో ఎప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా సోషల్ మీడియా క్షణాల్లో హీటెక్కిపోతుంది. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, శోభితా…

2 days ago

This website uses cookies.