Political Talk: తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణాలు ఎన్నికల ముందు వచ్చేసరికి పూర్తిగా మారేలా కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలో అమిత్ షా భేటీ అయ్యారు. ఇక మోడీతో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. వీరి కలయిక ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీలో చూసుకుంటే అసలే జనసేన, టీడీపీ పొత్తు ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీలో ఇప్పటికే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. జనసేన ఓటు షేర్ గత ఎన్నికలతో పోలిస్తే పెరిగింది.
అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా మారేలా కనిపిస్తోంది. అదే జరిగితే 2014 ఎన్నికల రిజల్ట్ రిపీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జనసేన పార్టీ ప్రభావాన్ని ఎన్నికల ముందు తగ్గించే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉండగా సడెన్ గా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని ఖరారు చేశారు. ఈ యాత్ర జరిగితే కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి మరింత ఇమేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాపు యువత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. ఇప్పటికే వారు గ్రౌండ్ లెవల్ లో అందరిని మోటివేట్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలని కలవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో టీడీపీకి గ్రౌండ్ లెవల్ లో బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ గెలుపుకి టీడీపీ సహకరిస్తుందని, దానికి బదులుగా ఏపీలో టీడీపీ గెలుపుకి సపోర్ట్ చేయాలని అడిగినట్లు సమాచారం. దీనికి బీజేపీ నుంచి ఇంకా ఒక స్పష్టత రాలేదని టాక్. అయితే పవన్ కళ్యాణ్ తమతో ఉన్నారు కాబట్టి కచ్చితంగా బీజేపీ కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఈ రాజకీయ సమీకరణాలు రానున్న రోజులలో ఎలా మారుతాయనేది చూడాలి.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.