Pawan Kalyan : ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ గెలుపుతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని ఎప్పుడెప్పుడు కళ్లారా చూడాలా అని మెగా కుటుంబ సభ్యులు, ఇటు ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. మైక్ ముందు పవన్ అనే నేను.. అంటూ పవర్ స్టార్ ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యారు. ఈ అద్భుత దృష్యాన్ని చూసేందుకు మెగా ఫ్యామిలీ కూడా సభా కార్యక్రమానికి బయల్దేరింది. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎననికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తన సత్తా ఏంటో చాటారు. ఇక ఇవాళ ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో ప్రపంచం మొత్తం చూపు ఏపీపై పడింది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా ఈ వేడుకను కళ్ళార చూడనికీ ముస్తాబు అయ్యింది. ఇక పవన్ కొడుకు అకీరా, కూతురు ఆద్యతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సుల్లో సంప్రదాయ దుస్తుల్లో వేడుకకు బయలు దేరారు.
ఇన్ని రోజుల్లో సినిమా కార్యక్రమాల వేదికపైనే పవన్ స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ టైమ్ పిఠాపురం ఎమ్మెల్యాగా, ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ స్పీచ్ వినిపించబోతున్నారు. దీంతో ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజల కళ్లు కూడా ఆయన మీదే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడాలని అకీరా, ఆద్య, సాయిధరమ్ తేజ్, నిహారిక, చిరు,నాగబాబు ఫ్యామిలీ మొత్తం వేదికకు బయల్దేరింది. ప్రస్తుతం వారు బస్సులో కూర్చుని దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా అందరి కళ్లు అకీరా, ఆద్య పైనే ఉన్నాయి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.