Pawan Kalyan : ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ గెలుపుతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని ఎప్పుడెప్పుడు కళ్లారా చూడాలా అని మెగా కుటుంబ సభ్యులు, ఇటు ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. మైక్ ముందు పవన్ అనే నేను.. అంటూ పవర్ స్టార్ ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యారు. ఈ అద్భుత దృష్యాన్ని చూసేందుకు మెగా ఫ్యామిలీ కూడా సభా కార్యక్రమానికి బయల్దేరింది. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎననికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తన సత్తా ఏంటో చాటారు. ఇక ఇవాళ ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో ప్రపంచం మొత్తం చూపు ఏపీపై పడింది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా ఈ వేడుకను కళ్ళార చూడనికీ ముస్తాబు అయ్యింది. ఇక పవన్ కొడుకు అకీరా, కూతురు ఆద్యతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సుల్లో సంప్రదాయ దుస్తుల్లో వేడుకకు బయలు దేరారు.
ఇన్ని రోజుల్లో సినిమా కార్యక్రమాల వేదికపైనే పవన్ స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ టైమ్ పిఠాపురం ఎమ్మెల్యాగా, ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ స్పీచ్ వినిపించబోతున్నారు. దీంతో ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజల కళ్లు కూడా ఆయన మీదే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడాలని అకీరా, ఆద్య, సాయిధరమ్ తేజ్, నిహారిక, చిరు,నాగబాబు ఫ్యామిలీ మొత్తం వేదికకు బయల్దేరింది. ప్రస్తుతం వారు బస్సులో కూర్చుని దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా అందరి కళ్లు అకీరా, ఆద్య పైనే ఉన్నాయి.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.