News: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చురుకుగా పావులు కదుపుతూ ప్రజలలోకి వెళ్తున్నాడు. వీలైనంత వరకు, వీలైనన్ని సార్లు ఏదో ఒక అంశం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యామాలని చేపడుతున్నారు. పార్టీ క్యాడర్ కూడా బలంగా నియోజకవర్గాలలో ప్రజల మధ్యకి వెళ్లి జనసేనాని ఇచ్చిన పిలుపుతో ప్రజా ఉద్యమాలలో భాగం అవుతున్నారు. ప్రస్తుతం జగనన్న ఇల్లు- ప్రజలందరికి కన్నీళ్లు అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జగనన్న ఇస్తానని హామీ ఇచ్చిన హౌస్ లని పూర్తి చెయ్యలేదని, ఈ హోసింగ్ స్కీంలో పెద్ద అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్ చేస్తూ ప్రత్యక్షంగా జనసేన క్యాడర్ ని గ్రౌండ్ లెవల్ లోకి పంపిస్తూ జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో క్యాంపైన్ స్టార్ట్ చేశారు.
ఇది ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతుంది. జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్స్ లో నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదని చూపించడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం జనసేనాని చేస్తున్నారు. దీనికి తిప్పి కొట్టడానికి ఈ జగనన్న ఇల్లు స్కీంలో లబ్ది పొందిన వారితో వీడియోలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జనసేన నాయకులు వెళ్లే చోటకి లబ్ధిదారులని పంపిస్తూ గలాటా సృష్టిస్తున్నారు. అలా చేసి కావాలనే జనసేన పార్టీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా గుంకలాంలో హోసింగ్ ప్రాజెక్ట్స్ ని సందర్శించి అక్కడ అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలని చూశారు. అక్కడే ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తూ తనకి ఒక్క అవకాశం ఇవ్వాలని, 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఇప్పటం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కారు బోనెట్ మీద కూర్చొని ప్రయాణించిన ఘటనపై ఒక కామన్ మెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అలాగే రిషికొండలో ఏరియల్ వ్యూ విజువల్స్ తీసుకోవడం నిషేధం విధించారు. దీనికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఏరియల్ విజువల్స్ చిత్రీకరించారు. దీనిపై కూడా కేసు రిజిస్టర్ చేయాలని భావిస్తున్నారు. ఇలా కేసులలో ఇరికించి చట్టపరంగా కూడా జనసేనాని భయపెట్టే ప్రయత్నం చేయాలని వైసీపీ భావిస్తుంది. ఇప్పుడు వైసీపీ వెర్సర్ జనసేనగా ఉన్న ఈ ఏపీలో రాజకీయ పోరు ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.