Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో వచ్చే ఎన్నికలలో గెలవడానికి ఎవరికీ వారు తమ వ్యూహాలని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. తగ్గేది లే అన్నట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నాయి. ఇక ప్రత్యర్ధులని చెత్తు చేయడానికి ఎవరికివారు తమ వ్యూహాలని అమలు చేస్తూ ఉండటం విశేషం. అధికార పార్టీ వైసీపీ టీడీపీ, జనసేన కలవకుండా చేయడం కోసం రకరకాల వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళ్తున్నాయి. ఇక జనసేన పార్టీ వైసీపీని గద్దె దించి తాము ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని భావిస్తుంది. ఇక టీడీపీ కూడా ఒంటరిగా లేదంటే పొత్తుల ద్వారా వచ్చే ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇలా ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో ప్రజలకి చేరువ అయ్యేందుకు తమ కార్యాచరణ సిద్ధం చేసుకొని వెళ్తున్నారు.
రానున్న ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ సిద్ధం అవుతుంది. అయితే జనసేన ఎక్కువగా సీట్లు అడుగుతూ ఉండటం అలాగే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కూడా అడుగుతూ ఉండటంతో కొంత వరకు వెనక్కి తగ్గారు. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ మూడు స్థానాలు గెలిచింది. దీంతో సొంత బలంగా గెలవగలం అని టీడీపీ భావిస్తుంది. అయితే ఇదంతా జగన్ వ్యూహంలో భాగం అని పవన్ కళ్యాణ్ ఒక అంచనాకి వచ్చినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. టీడీపీ, జనసేన మధ్య దూరం పెంచడం ద్వారా పొత్తుకి అవకాశం లేకుండా చేసి లబ్ది పొందాలని వైఎస్ జగన్ వేసిన వ్యూహంలో భాగమే అని భావిస్తున్నారు.
ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు కూడా దానికి తగ్గట్లుగానే ఉన్నాయని పార్టీ నేతలతో చెప్పినట్లు తెలుస్తుంది. ఎవరు కూడా వారి వ్యూహంలో ఇరుక్కోవద్దని, క్యాడర్ ని పిలుపునిచ్చారు. జనసేన పార్టీని దెబ్బ తీసేందుకు అన్ని రకాలుగా వైసీపే కుట్రలు చేస్తుందని పవన్ కళ్యాణ్ అంచనాకి వచ్చినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. వారి వ్యూహాలకి అవకాశం ఇవ్వకుండా జనసైనికులు నమ్మకంతో ఉండాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, యువత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకుంటా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ వ్యూహాలలో భాగంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విశ్వసించవద్దు అని సూచించారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.