Beauty Tips: చలికాలం వచ్చిందంటే చాలు పాదాలు పగుళ్ళ సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చలికాలంలో పాదాలు ఎక్కువగా చీలి నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇలా ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఎన్నో రకాల క్రీములు వాడిన పాదాల సంరక్షణ చేపట్టిన కూడా ఇలా పాదాల పగుళ్లు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా పాదాల పగుళ్ళ సమస్యతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు.
ఆయుర్వేద ప్రకారం వేపాకుకి ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అందుకే ఆయుర్వేదంలో వేపాకును విరివిగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వేపాకును ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో చర్మ సమస్యల నుంచి రక్షించడానికి దోహదం చేస్తుంది.
ఈ క్రమంలోనే పాదాల పగుళ్ళ సమస్యతో బాధపడేవారు కాస్త వేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తని మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమంలోకి పావు టీస్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు అరగంట పాటు పాదాలకు పట్టించుకుని అనంతరం చల్లనీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పాదాల పగుళ్ళ సమస్య తగ్గిపోవడమే కాకుండా పాదాలు కూడా చాలా మృదువుగా మారిపోతాయి.
Drinking water: నీరు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమనే విషయం తెలిసిందే. ప్రతిరోజు దాదాపు 7 నుంచి 8…
Tholi Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆషాడ మాసంలో వచ్చే…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
This website uses cookies.