Categories: LatestNewsPolitics

Yuvagalam: యువగళంతో నారా లోకేష్ కి పెరుగుతున్న మైలేజ్

Yuvagalam: టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా ఏపీ రాజకీయాలలోకి వచ్చిన నారా లోకేష్ మొదటి ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 అనే హోదాని మాత్రం సొంతం చేసుకోగలిగారు. పార్టీకి అన్నితానై బలమైన టీమ్ ని తయారు చేసుకున్నాడు. వారితో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిణితి చెందే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ పై ప్రత్యర్ధులు పప్పు అంటూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే తన రాజకీయ పరిణితిని పెంచుకోవడంతో పాటు నాయకుడిగా తనని తాను ప్రాజెక్ట్చేసుకోవడానికి నారా లోకేష్ పాదయాత్రని ఎంపిక చేసుకున్నారు.

అయితే లోకేష్ పాదయాత్ర చేస్తానని చెప్పినపుడు కనీసం రెండు జిల్లాల్లో కూడా తిరగలేడు అంటూ చాలా మంది విమర్శలు చేశారు. వాటిని ఎదుర్కొంటూనే తన ప్రయాణం మొదలు పెట్టారు. యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్ వంద రోజుల యాత్రని పూర్తి చేసుకున్నారు. రాయలసీమలో చాలా జిల్లాలు ఇప్పటికే కవర్ చేశారు. ఇక నారా లోకేష్ పాదయాత్రని అధికార పార్టీ వైసీపీ ఆరంభంలో లైట్ గా తీసుకున్న తర్వాత పద్ధతి మార్చారు. లోకేష్ పర్యటిస్తున్న ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై విమర్శలు చేయడంతో  అవి పార్టీ మైలేజ్ ని దెబ్బతీస్తున్నాయని ఎదురుదాడి మొదలు పెట్టారు.

ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుదాడి చేస్తూ ఉండటంతో ప్రజలలో లోకేష్ ఆదరణ మరింత పెరుగుతూ పోతోంది. బలమైన నాయకుడిగా చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు అందుకునే వ్యక్తిగా తనని తాను ప్రాజెక్ట్ చేసుకోవడంలో, పార్టీ క్యాడర్ కి నమ్మకం కలిగించడంలో లోకేష్ విజయం సాధించాడని చెప్పాలి. ఒక వేళ వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా నారాలోకేష్ పాదయాత్ర బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే లెక్క. అలాగే క్యాడర్ కూడా భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనని ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.

Varalakshmi

Recent Posts

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

3 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

14 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

20 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

3 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

3 days ago

This website uses cookies.