Yuvagalam: టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా ఏపీ రాజకీయాలలోకి వచ్చిన నారా లోకేష్ మొదటి ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 అనే హోదాని మాత్రం సొంతం చేసుకోగలిగారు. పార్టీకి అన్నితానై బలమైన టీమ్ ని తయారు చేసుకున్నాడు. వారితో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిణితి చెందే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ పై ప్రత్యర్ధులు పప్పు అంటూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే తన రాజకీయ పరిణితిని పెంచుకోవడంతో పాటు నాయకుడిగా తనని తాను ప్రాజెక్ట్చేసుకోవడానికి నారా లోకేష్ పాదయాత్రని ఎంపిక చేసుకున్నారు.
అయితే లోకేష్ పాదయాత్ర చేస్తానని చెప్పినపుడు కనీసం రెండు జిల్లాల్లో కూడా తిరగలేడు అంటూ చాలా మంది విమర్శలు చేశారు. వాటిని ఎదుర్కొంటూనే తన ప్రయాణం మొదలు పెట్టారు. యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్ వంద రోజుల యాత్రని పూర్తి చేసుకున్నారు. రాయలసీమలో చాలా జిల్లాలు ఇప్పటికే కవర్ చేశారు. ఇక నారా లోకేష్ పాదయాత్రని అధికార పార్టీ వైసీపీ ఆరంభంలో లైట్ గా తీసుకున్న తర్వాత పద్ధతి మార్చారు. లోకేష్ పర్యటిస్తున్న ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై విమర్శలు చేయడంతో అవి పార్టీ మైలేజ్ ని దెబ్బతీస్తున్నాయని ఎదురుదాడి మొదలు పెట్టారు.
ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుదాడి చేస్తూ ఉండటంతో ప్రజలలో లోకేష్ ఆదరణ మరింత పెరుగుతూ పోతోంది. బలమైన నాయకుడిగా చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు అందుకునే వ్యక్తిగా తనని తాను ప్రాజెక్ట్ చేసుకోవడంలో, పార్టీ క్యాడర్ కి నమ్మకం కలిగించడంలో లోకేష్ విజయం సాధించాడని చెప్పాలి. ఒక వేళ వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా నారాలోకేష్ పాదయాత్ర బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే లెక్క. అలాగే క్యాడర్ కూడా భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనని ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.