Categories: LatestNewsPolitics

Yuvagalam: యువగళంతో నారా లోకేష్ కి పెరుగుతున్న మైలేజ్

Yuvagalam: టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా ఏపీ రాజకీయాలలోకి వచ్చిన నారా లోకేష్ మొదటి ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 అనే హోదాని మాత్రం సొంతం చేసుకోగలిగారు. పార్టీకి అన్నితానై బలమైన టీమ్ ని తయారు చేసుకున్నాడు. వారితో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిణితి చెందే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ పై ప్రత్యర్ధులు పప్పు అంటూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే తన రాజకీయ పరిణితిని పెంచుకోవడంతో పాటు నాయకుడిగా తనని తాను ప్రాజెక్ట్చేసుకోవడానికి నారా లోకేష్ పాదయాత్రని ఎంపిక చేసుకున్నారు.

అయితే లోకేష్ పాదయాత్ర చేస్తానని చెప్పినపుడు కనీసం రెండు జిల్లాల్లో కూడా తిరగలేడు అంటూ చాలా మంది విమర్శలు చేశారు. వాటిని ఎదుర్కొంటూనే తన ప్రయాణం మొదలు పెట్టారు. యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్ వంద రోజుల యాత్రని పూర్తి చేసుకున్నారు. రాయలసీమలో చాలా జిల్లాలు ఇప్పటికే కవర్ చేశారు. ఇక నారా లోకేష్ పాదయాత్రని అధికార పార్టీ వైసీపీ ఆరంభంలో లైట్ గా తీసుకున్న తర్వాత పద్ధతి మార్చారు. లోకేష్ పర్యటిస్తున్న ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై విమర్శలు చేయడంతో  అవి పార్టీ మైలేజ్ ని దెబ్బతీస్తున్నాయని ఎదురుదాడి మొదలు పెట్టారు.

ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుదాడి చేస్తూ ఉండటంతో ప్రజలలో లోకేష్ ఆదరణ మరింత పెరుగుతూ పోతోంది. బలమైన నాయకుడిగా చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు అందుకునే వ్యక్తిగా తనని తాను ప్రాజెక్ట్ చేసుకోవడంలో, పార్టీ క్యాడర్ కి నమ్మకం కలిగించడంలో లోకేష్ విజయం సాధించాడని చెప్పాలి. ఒక వేళ వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా నారాలోకేష్ పాదయాత్ర బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే లెక్క. అలాగే క్యాడర్ కూడా భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనని ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.

Varalakshmi

Recent Posts

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…

23 hours ago

Tuesday Auspiciousness: మంగళవారం కొత్త పనులు ప్రారంభించవచ్చా? మంచిదేనా?

Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…

23 hours ago

Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…

2 days ago

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

2 days ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

2 days ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

3 days ago

This website uses cookies.